Share News

GHMC: ప్రాపర్టీ టాక్స్‌పై కౌన్సిల్‌లో చర్చ.. అధికారులను నిలదీసిన కార్పొరేటర్లు

ABN , Publish Date - Feb 20 , 2024 | 01:17 PM

Telangana: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో సమస్యలపై కార్పొరేటర్లు కౌన్సిల్లో ప్రస్తావిస్తూ అధికారులను నిలదీస్తున్నారు. అలాగే ప్రాపర్టీ టాక్స్‌పై కౌన్సిల్‌లో చర్చ జరిగింది. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ తీసుకుంటున్నారని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు తెలిపారు.

GHMC: ప్రాపర్టీ టాక్స్‌పై కౌన్సిల్‌లో చర్చ.. అధికారులను నిలదీసిన కార్పొరేటర్లు

హైదరాబాద్, ఫిబ్రవరి 20: జీహెచ్‌ఎంసీ కౌన్సిల్ సమావేశం (GHMC Council Meeting) కొనసాగుతోంది. హైదరాబాద్‌లో (Hyderabad) సమస్యలపై కార్పొరేటర్లు కౌన్సిల్లో ప్రస్తావిస్తూ అధికారులను నిలదీస్తున్నారు. అలాగే ప్రాపర్టీ టాక్స్‌పై కౌన్సిల్‌లో చర్చ జరిగింది. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఇష్టం వచ్చినట్టు పర్మిషన్స్ తీసుకుంటున్నారని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు (BRS Corporators) తెలిపారు. సెల్ఫ్ అసెన్మెంట్‌పై అనేక అవకతవకలు జరుగుతున్నాయన్నారు. ప్రాపర్టీ టాక్స్‌పై చాలా ఆదాయం తగ్గుతున్నా.. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రెసిడెన్షియల్‌ను కమర్షియల్‌గా మారుస్తున్నప్పటికీ టాక్స్ కలెక్ట్ చెయ్యకపోవడంతో జీహెచ్‌ఎంసీ (GHMC) ఆదాయం కోల్పోతుందని బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు వెల్లడించారు.

బీజేపీ కార్పొరేటర్లు (BJP Corporators) మాట్లాడుతూ.. టాక్స్ వసూలు చేస్తున్నాము కానీ ఎంత వరకు వారికి మౌలిక సదుపాయాలు అందిస్తున్నామని ప్రశ్నించారు. జనానికి కనీసం పార్కింగ్ సదుపాయం కల్పించడం లేదన్నారు. హైటెక్ సిటీ, సరూర్‌నగర్‌లో ఒకే లాగా టాక్స్ వసూలు ఎట్లా చేస్తున్నారని నిలదీశారు. టాక్స్‌పై అధికారుల నిర్లక్ష్యంగా వహిస్తున్నారని మండిపడ్డారు. టాక్స్ కలెక్షన్ విభాగంపై క్రెడెబిలిటీ లేదన్నారు. తీసుకునే పర్మిషన్ ఒక్కటి.. అక్కడ నడిపించేది ఒక్కటి అంటూ బీజేపీ కార్పొరేటర్లు వ్యాఖ్యలు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 20 , 2024 | 01:17 PM