Share News

TS News: మంత్రి పొంగులేటితో ధరణి కమిటీ భేటీ

ABN , Publish Date - Jan 23 , 2024 | 04:02 PM

Telangana: రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ధరణి కమిటీ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యింది.

TS News: మంత్రి పొంగులేటితో ధరణి కమిటీ భేటీ

హైదరాబాద్, జనవరి 23: రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో (Minister Ponguleti Srinivas reddy) ధరణి కమిటీ మంగళవారం సచివాలయంలో భేటీ అయ్యింది. ధరణి సమస్యలపై తక్షణ పరిష్కారాల కోసం ప్రభుత్వానికి మధ్యంతర నివేదిక ఇస్తామని నిన్న (సోమవారం) ధరణి కమిటీ చెప్పిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మధ్యంతర నివేదికపై రెవెన్యూ శాఖ మంత్రితో కమిటీ సభ్యులు చర్చలు నిర్వహించారు. రేపు(బుధవారం) సిద్దిపేట, మెదక్ జిల్లాలతో పాటు మరో రెండు జిల్లాలు... మొత్తం నాలుగు జిల్లాల కలెక్టర్లతో సీసీఎల్ఏలో ధరణి కమిటీ సమావేశం కానుంది. క్షేత్రస్థాయి భూ సమస్యలపై కమిటీ ఆరా తీయనుంది. భేటీ అనంతరం రెవెన్యూ శాఖ మంత్రికి పూర్తి స్థాయి మధ్యంతర నివేదికను కమిటీ సభ్యులు ఇవ్వనున్నారు. త్వరలోనే కమిటీ మధ్యంతర నివేదికపై సీఎం రేవంత్ రెడ్డితో (CM Revanth Reddy) రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చర్చించనున్నారు.

Updated Date - Jan 23 , 2024 | 04:02 PM