Home » Dharani
ధరణి పోర్టల్లో జరిగిన అక్రమాలపై ఉన్నతస్థాయి కమిటీ.. తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. ధరణి అక్రమాలపై ఫోరెన్సిక్ ఆడిట్లో పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ధరణి, భూ భారతి పోర్టల్లో సాంకేతిక లోపాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు రూ.3.90 కోట్ల గండికొట్టిన ముఠా గుట్టురట్టు చేశారు. వరంగల్ పోలీసులు. 15 మందిని అరెస్ట్ చేసి, రూ. 63 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు.
ధరణి స్థానే గత ఏప్రిల్ 14 నుంచి అమల్లోకి వచ్చిన భూభారతి ద్వారా రైతులు సమస్యలు ఉచితంగానే పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
ధరణి పోర్టల్ ఆధారంగా జరిగిన అక్రమాలపై నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ మొదలు కానుంది. కేరళ ప్రభుత్వ సంస్థ అయిన కేరళ సెక్యూరిటీ ఆడిట్ అండ్ అస్యూరెన్స్ (కేఎస్ఏఏసీ) ఈ ఆడిట్ నిర్వహించనుంది.
ధరణి పోర్టల్లో విలువైన భూముల రికార్డులు తారుమారు చేశారని, పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని వచ్చిన ఆరోపణలను నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్కు సిద్ధమైంది.
గతంలో బీఆర్ఎస్ శ్రేణుల కోసమే కేసీఆర్ ధరణి చట్టాన్ని తీసుకొచ్చారని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్సరెడ్డి అన్నారు. భూమితో సంబంధంలేని, గులాబీ చొక్కా వేసుకున్న వారికి పట్టాలు ఇచ్చి, రైతుబంధు పథకంతో లబ్ధి కలిగించారని ఆరోపించారు.
ధరణి పోర్టల్లో జరిగిన అవకతవకల నిగ్గు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ను నిర్వహించే ఏజెన్సీని ఎంపిక చేసే ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ఏజెన్సీ ఎంపికకు సంబంధించిన టెండర్ల దశ దాటకపోవడంతో ఇటీవల సీసీఎల్ఏ అధికారుల సమీక్షలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఒకింత అసహనం వ్యక్తం చేశారు.
ధరణి పోర్టల్ని అడ్డుపెట్టుకుని జరుగుతున్న మోసాలు అన్ని ఇన్ని కావు..! నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని పలుచోట్ల ధరణి ఆపరేటర్ల ద్వారా తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
ఒక చిన్న బగ్.. ధరణి పోర్టల్ నిర్వహణను కుప్పకూల్చేంత పని చేసింది. ఎక్కడ లోపం ఉందో తెలుసుకునేందుకు నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ (ఎన్ఐసీ) సాంకేతిక నిపుణులు, సీసీఎల్ఏ అధికారులు తలపట్టుకోవాల్సి వచ్చింది.
ధరణి స్థానంలో భూ భారతి పోర్టల్ను ప్రభుత్వం సంక్రాంతిలోపే అందుబాటులోకి తేచ్చే అవకాశాలున్నట్టు సమాచారం. భూభారతికి సంబంధించి సీసీఎల్ఏ మూడు రకాల ప్రతిపాదనలు రూపొందించింది.