TG News: స్కూళ్లను వదలని చెడ్డి గ్యాంగ్..
ABN , Publish Date - Mar 18 , 2024 | 11:37 AM
Telangana: ఇప్పటి వరకు ఇళ్లలోనే చోరీకి తెగబడ్డ చెడ్డి గ్యాంగ్ కన్ను ఇప్పుడు స్కూళ్లపై పడింది. రాష్ట్రంలో చెడ్డి గ్యాంగ్ హల్చల్ అంతా ఇంతా కాదు. అర్ధరాత్రులు ఇళ్లలోకి చొరబడి దొరికినకాడికి దోచుకుంటుంది ఈ చెడ్డి గ్యాంగ్. ఇప్పుడు ఆ గ్యాంగ్.. స్కూళ్లను టార్గెట్గా చేసుకుంది. మియాపూర్లోని ఓ స్కూల్లో చెడ్డి గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
![TG News: స్కూళ్లను వదలని చెడ్డి గ్యాంగ్..](https://media.andhrajyothy.com/media/2024/20240313/robbery_miyapur_9473de2f11.jpg)
హైదరాబాద్, మార్చి 18: ఇప్పటి వరకు ఇళ్లలోనే చోరీకి తెగబడ్డ చెడ్డి గ్యాంగ్ కన్ను ఇప్పుడు స్కూళ్లపై పడింది. రాష్ట్రంలో చెడ్డి గ్యాంగ్ హల్చల్ అంతా ఇంతా కాదు. అర్ధరాత్రులు ఇళ్లలోకి చొరబడి దొరికినకాడికి దోచుకుంటుంది ఈ చెడ్డి గ్యాంగ్. ఇప్పుడు ఆ గ్యాంగ్.. స్కూళ్లను టార్గెట్గా చేసుకుంది. మియాపూర్లోని ఓ స్కూల్లో చెడ్డి గ్యాంగ్ దొంగతనానికి పాల్పడింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మియాపూర్లోని వరల్డ్ వన్ స్కూల్లో శనివారం అర్ధరాత్రి ఇద్దరు దొంగలు చోరీకి తెగబడ్డారు. స్కూల్ కౌంటర్లో ఉన్న 7 లక్షల 85 వేల నగదును దొంగలు దోచుకెళ్లారు. దొంగతనం దృశ్యాలు స్కూల్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఒంటిమీద బట్టలు లేకుండా కేవలం చెడ్డిలతో దుండగులు చోరీకి వచ్చారు. ఈ ఘటనపై స్కూల్ యాజమాన్యం మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్కూల్లో ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిన ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
PM MODI: జగిత్యాల చేరుకున్న మోదీ.. ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..!
AP Politics: ‘ప్రజాగళం’ సభలో పోలీసుల సహాయ నిరాకరణపై కూటమి సీరియస్
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...