Share News

PM MODI: జగిత్యాల చేరుకున్న మోదీ.. ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..!

ABN , Publish Date - Mar 18 , 2024 | 11:21 AM

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు తెలంగాణకు వచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాలలో నిర్వహిస్తున్న విజయసంకల్ప సభలో మోదీ పాల్గొంటున్నారు. కాసేపట్లో సభా వేదికపైకి ప్రధాని మోదీ రానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చారు.

PM MODI: జగిత్యాల చేరుకున్న మోదీ.. ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ..!

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు తెలంగాణకు వచ్చారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని జగిత్యాలలో నిర్వహిస్తున్న విజయసంకల్ప సభలో మోదీ పాల్గొంటున్నారు. కాసేపట్లో సభా వేదికపైకి ప్రధాని మోదీ రానున్నారు. ఈ సభకు భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చారు. ప్రధాని ప్రసంగానికి ముందు బీజేపీ నాయకులు మాట్లాడారు. కాంగ్రెస్ వంద రోజు పాలనపై ప్రజలు విసుగుతో ఉన్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో ఉత్తర తెలంగాణలో గెలిపించాలని కోరారు. ప్రధాని మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత రెండోసారి ప్రధాని తెలంగాణలో పర్యటిస్తున్నారు. దీంతో ఈ లోక్‌సభ ఎన్నికలను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రసంగంపై ఉత్కంఠ..

ప్రధాని మోదీ కాంగ్రెస్ వంద రోజుల పాలనపై ఎలా స్పందిస్తారు.. తెలంగాణకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటిస్తుండటంతో కవిత అరెస్ట్‌పై ప్రధాని స్పందిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Mar 18 , 2024 | 11:26 AM