Share News

CM Jagan: రేపు హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్.. ఎవరిని కలుస్తారంటే..?

ABN , Publish Date - Jan 03 , 2024 | 12:27 PM

Telangana: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి రేపు(గురువారం) హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను జగన్ పరామర్శించనున్నారు. డిసెంబర్ 8న ఫామ్‌హౌజ్‌లోని బాత్‌రూంలో జారి పడటంతో కేసీఆర్‌కు తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. వెంటనే కేసీఆర్‌కు కుటుంబసభ్యులు యశోదా ఆస్పత్రికి తరలించారు.

CM Jagan: రేపు హైదరాబాద్‌కు ఏపీ సీఎం జగన్..  ఎవరిని కలుస్తారంటే..?

హైదరాబాద్, జనవరి 3: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) రేపు(గురువారం) హైదరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను (Former CM KCR) జగన్ పరామర్శించనున్నారు. డిసెంబర్ 8న ఫామ్‌హౌజ్‌లోని బాత్‌రూంలో జారి పడటంతో కేసీఆర్‌ తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. వెంటనే కేసీఆర్‌ను కుటుంబసభ్యులు యశోదా ఆస్పత్రికి తరలించారు.

ఈ సందర్భంగా వైద్యులు పరీక్షించి తుంటి ఎముక ఫ్యాక్చర్ అయ్యిందని ఆపరేషన్ చేయాలని చెప్పారు. అనంతరం యశోదా వైద్యుల ఆధ్వర్యంలో కేసీఆర్‌కు తుండి ఎముక మార్పిడి శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. వారం పాటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిసెంబర్ 15న కేసీఆర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి నందినగర్‌లోని పాత ఇంటికి వెళ్లారు. ఇంట్లో కేసీఆర్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు.

KCR-Hospital.jpg

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 03 , 2024 | 12:27 PM