Share News

Breaking: కవిత ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగింపు

ABN , Publish Date - Mar 23 , 2024 | 01:20 PM

Kavitha ED Custody: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఈడీ కస్టడీ (ED Custody) మరో మూడ్రోజులు పొడిగించడం జరిగింది. అరెస్ట్ తర్వాత ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే..

Breaking: కవిత ఈడీ కస్టడీ మరో 3 రోజులు పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు (BRS MLC Kavitha) ఈడీ కస్టడీ (ED Custody) మరో మూడ్రోజులు పొడిగించడం జరిగింది. అరెస్ట్ తర్వాత ఏడు రోజులపాటు ఈడీ కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ఈడీ అధికారులు హాజరుపరిచారు. విచారించాల్సింది ఇంకా చాలా ఉందని.. ఈ కస్టడీలో కవిత నుంచి ఎలాంటి సమాచారం రాలేదని కోర్టుకు తెలపడంతో మూడ్రోజులపాటు కస్టడీకి న్యాయస్థానం ఒప్పుకుంది. కాగా.. ఐదు రోజుల కస్టడీ కావాలని కోరగా కోర్టు మాత్రం మూడ్రోజులకే అనుమతిచ్చింది.

Kavitha: కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు అందుకేనా..?



Kavitha-ED-Enquiry-Latest-3.jpg

అంతకుముందు ఏం జరిగింది..?

ఏడు రోజుల కస్టడీ ముగియడంతో కవితను ఢిల్లీ రోజ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపర్చారు. ఈడీ తరపున న్యాయవాది జోయాబ్ హుసేన్ వాదనలు వినిపించారు. కవితను విచారించేందుకు మరో అయిదు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. నలుగురు స్టేట్మెంట్‌ను కవితని అడిగామని.. కిక్ బ్యాగ్స్ గురించి కూడా అడిగినట్లు తెలిపారు. అయితే విచారణకు కవిత సహకరించడం లేదన్నారు. సమీర్ మహేంద్రతో కలిసి కవితను ప్రశ్నించాలని.. లిక్క్ స్కామ్‌లో రూ. కోట్లలో కిక్ బ్యాక్‌లు అందాయన్నారు. సౌత్ గ్రూప్‌నకు రూ.100 కోట్లు చేరాయని తెలిపారు. కవిత మొబైల్ డేటాను విశ్లేషించామని.. అయితే ఫోన్‌లోని డేటాను తొలగించారన్నారు. కవిత కుటుంబ సభ్యులు వివారాలు ఇవ్వడం లేదని తెలిపారు. కవిత మేనల్లుడి వ్యాపారానికి సంబంధించి వివరాలు అడిగామని.. తనకు తెలియదని కవిత సమాధానం ఇచ్చారన్నారు.

Kavitha-ED-Enquiry-Latest-1.jpg

వాదోపవాదాలు!

సోదాల్లో కవిత మేనల్లుడి ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారని.. అప్పటి నుంచి మేనల్లుడు కనిపించడం లేదని ఈడీ తరపు న్యాయవాది వెల్లడించారు. మరికొన్ని చోట్ల సోదాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కుటుంబ ఆదాయపు పన్ను, వ్యాపారాల వివరాలు అడిగామని.. కానీ ఇప్పటివరకు ఇవ్వలేదన్నారు. రేఖా శరణ్‌కు సంబంధించి సమాచారం ఇవ్వడంలేదని చెప్పారు. సమీర్ మహేంద్ర కూడా కవిత బినామీ అని.. ఇప్పటికీ ఇంకా సోదాలు జరుగుతున్నాయని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అయితే ఈడీ కస్టడీలో ఉన్న కవితను బ్యాంక్ స్టేట్‌మెంట్స్, ఐటీ అడుగుతున్నారని.. కస్టడీలో ఉన్నప్పుడు కవిత డాక్యుమెంట్ వివరాలు ఎలా ఇస్తారని ఆమె తరపు న్యాయవాది వాదించారు. కవిత తరపున బెయిల్ పిటిషన్ వేశామని.. బెయిల్ పిటిషన్‌పై ఈడీకి నోటీసులు ఇవ్వాలని కవిత తరపు న్యాయవాది కోర్టును కోరారు. అయితే బెయిల్‌ పిటిషన్‌ను ఈడీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రస్తుతం బెయిల్‌కు విచారణ అర్హత లేదని ఈడీ పేర్కొంది.

Updated Date - Mar 23 , 2024 | 01:34 PM