Share News

Amit Shah Live: పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ శ్రేణులకు ‘షా’ దిశానిర్దేశం

ABN , Publish Date - Mar 12 , 2024 | 02:55 PM

Telangana Elections 2024: తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్రంపై (Telangana) బీజేపీ (BJP) అగ్రనేతలు దండయాత్ర చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కించుకున్న కాషాయ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ టార్గెట్‌ను మించి సీట్లు గెలవాలని వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్‌కు విచ్చేశారు.

 Amit Shah Live: పార్లమెంట్ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ శ్రేణులకు ‘షా’ దిశానిర్దేశం

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ముందు రాష్ట్రంపై (Telangana) బీజేపీ (BJP) అగ్రనేతలు దండయాత్ర చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లు దక్కించుకున్న కాషాయ పార్టీ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ టార్గెట్‌ను మించి సీట్లు గెలవాలని వ్యూహరచన చేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) హైదరాబాద్‌కు విచ్చేశారు. సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్స్‌లో జరుగుతున్న సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ శ్రేణులకు షా దిశానిర్దేశం చేశారు. దేశ ప్రజలంతా మరోసారి మోదీని ప్రధానిగా ఎన్నుకోబోతున్నారని చెప్పుకొచ్చారు. కేంద్రంలో మరోసారి రానున్నది బీజేపీయేనని సమావేశంలో షా ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - Mar 12 , 2024 | 02:57 PM