Share News

Hyderabad: అర్ధరాత్రి కూడా బస్సులు నడపండి..

ABN , Publish Date - May 25 , 2024 | 09:35 AM

గ్రేటర్‌లో ఆర్టీసీ బస్‌ సర్వీసులు అర్ధరాత్రి కూడా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌, జేబీఎస్(MGBS, JBS)‏లకు రాత్రి 12 గంటల తర్వాత పదుల సంఖ్యలో బస్సుల రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లాల నుంచి బస్టాండ్లకు వచ్చిన ప్రయాణికులు నగరంలోని ఇళ్లకు చేరేందుకు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు.

Hyderabad: అర్ధరాత్రి కూడా బస్సులు నడపండి..

- ఆర్టీసీకి పలువురి నుంచి విజ్ఞప్తుల వెల్లువ

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌లో ఆర్టీసీ బస్‌ సర్వీసులు అర్ధరాత్రి కూడా నడపాలని ప్రయాణికులు కోరుతున్నారు. జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌, జేబీఎస్(MGBS, JBS)‏లకు రాత్రి 12 గంటల తర్వాత పదుల సంఖ్యలో బస్సుల రాకపోకలు సాగిస్తుంటాయి. జిల్లాల నుంచి బస్టాండ్లకు వచ్చిన ప్రయాణికులు నగరంలోని ఇళ్లకు చేరేందుకు బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో ఆటోవాలాలు రెట్టింపుచార్జీలు వసూలు చేస్తున్నారంటూ ప్రయాణికులు చెబుతున్నారు.

దికూడా చదవండి: Hyderabad: భార్యను పంపడం లేదని మామ గొంతుకోసిన అల్లుడు..


సికింద్రాబాద్‌ నుంచి పఠాన్‌చెరువు(Secunderabad to Pathancheruvu) వరకు అర్ధరాత్రి తర్వాత ఆర్టీసీ రెండు బస్సులు నడుపుతోంది. అదే తరహాలో సికింద్రాబాద్‌ నుంచి బోరబండ, కొండాపూర్‌, కోఠి, ఉప్పల్‌, కూకట్‌పల్లి(Borabanda, Kondapur, Kothi, Uppal, Kukatpally) ప్రాంతాలకూ నైట్‌ సర్వీసులు నడపాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. రాత్రి 12 నుంచి ఉదయం 6 గంటల వరకు రద్దీ రూట్లలో బస్సులు నడిపితే తక్కువ చార్జీలతో ఇళ్లకు చేరుకునే అవకాశాలుంటాయని ప్రయాణికులు కోరుతున్నారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu Newshy

Updated Date - May 25 , 2024 | 10:02 AM