Share News

Parliament Elections: బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు పలువురు సీఎంలు, కేంద్ర మంత్రులు

ABN , Publish Date - Apr 18 , 2024 | 09:19 AM

నేటి నుంచి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. బీజేపీ నుంచి నేడు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘనందనరావు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.

Parliament Elections: బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు పలువురు సీఎంలు, కేంద్ర మంత్రులు

హైదరాబాద్: నేటి నుంచి తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లు ప్రారంభం కానున్నాయి. నామినేషన్ కార్యక్రమాలను గ్రాండ్‌గా నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. బీజేపీ అభ్యర్ధుల నామినేషన్లకు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. బీజేపీ నుంచి నేడు డీకే అరుణ, ఈటల రాజేందర్, రఘనందనరావు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. రఘనందనరావు నామినేషన్ ర్యాలీలో గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాల్గొననున్నారు. ఈటల రాజేందర్ నామినేషన్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరీ పాల్గొననున్నారు. మహబూబ్‌నగర్‌లో డీకే అరుణ నామినేషన్ కార్యక్రమంలో ఎంపీ లక్ష్మణ్ పాల్గొననున్నారు.

Bhadradri: నేడు భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 18 , 2024 | 09:19 AM