Share News

CM Revanth Reddy: కరీంనగర్‌ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు రేవంత్ దూరం..

ABN , Publish Date - Apr 22 , 2024 | 01:32 PM

కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్తి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉండనున్నారు. నేడు కాంగ్రెస్ తరుఫున వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. కరీంనగర్ సీటుపై అధిష్టానం ఎటూ తేల్చలేదు. రాజేందర్ రావే అభ్యర్థి అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు

CM Revanth Reddy: కరీంనగర్‌ కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్‌కు రేవంత్ దూరం..

కరీంనగర్: కరీంనగర్‌లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్తి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి దూరంగా ఉండనున్నారు. నేడు కాంగ్రెస్ తరుఫున వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆసక్తికర విషయం ఏంటంటే.. కరీంనగర్ సీటుపై అధిష్టానం ఎటూ తేల్చలేదు. రాజేందర్ రావే అభ్యర్థి అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి సైలెంట్ అయ్యారు. సన్నాహక సమావేశాలకు సైతం ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. గతంలో పొన్నం ప్రభాకర్ కోసం హుస్నాబాద్ అసెంబ్లీ సీటును ప్రవీణ్ రెడ్డి త్యాగం చేశారు. ఈ గందరగోళం మధ్య నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ దూరంగా ఉన్నారు. ప్రవీణ్ రెడ్డి వైపు అధిష్టానం, వెలిచాల రాజేందర్ వైపు పొన్నం.. మొత్తానికి కరీంనగర్ స్థానం విషయంలో గందరగోళం నెలకొంది.

Updated Date - Apr 22 , 2024 | 02:03 PM