Share News

Congress: పార్లమెంట్ ఎన్నికలపై సీఈసీ కీలక సమావేశం.. ఏం చర్చించారంటే..?

ABN , Publish Date - Mar 07 , 2024 | 09:28 PM

పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర కాంగ్రెస్ (Congress) హై కమాండ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈరోజు(గురువారం) ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అయింది. లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై ఓ స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రధాన కీలక అంశాలపై చర్చించారు.

Congress: పార్లమెంట్ ఎన్నికలపై సీఈసీ కీలక సమావేశం.. ఏం చర్చించారంటే..?
Congress

ఢిల్లీ: పార్లమెంట్ ఎన్నికలపై కేంద్ర కాంగ్రెస్ (Congress) హై కమాండ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఈరోజు(గురువారం) ఏఐసీసీ కార్యాలయంలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం అయింది. లోక్ సభ అభ్యర్థుల ఎంపికపై ఓ స్పష్టత వచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంలో ప్రధాన కీలక అంశాలపై చర్చించారు. సీఈసీ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, జైరాం రమేష్ సహా ఎన్నికల కమిటీ సభ్యులు, వివిధ రాష్ట్రాల పీసీసీలు పాల్గొన్నారు. కాంగ్రెస్ సీఈసీలో తెలంగాణ , కేరళ, కర్ణాటక, హర్యానా, చత్తీస్ ఘడ్, ఢిల్లీతో సహా పలు రాష్ట్రాల లోక్‌సభ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి. సీఈసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో దాదాపు 10 లోక్ సభ స్థానాలపై ఇప్పటికే కసరత్తు పూర్తి చేసిన లిస్ట్‌ను సీఈసీకి రాష్ట్ర నేతలు ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 07 , 2024 | 11:09 PM