Share News

Sanjay: అయోధ్యలో రాముడు పుట్టాడా.. లేదా..?.. పొన్నంకు బండి సంజయ్ సూటి ప్రశ్న..

ABN , Publish Date - Jan 14 , 2024 | 06:32 PM

రామమందిరం కట్టడం తప్పా ఒప్పా...? కాంగ్రెస్ నేతలు చెప్పాలని బీజేపీ లీడర్ బండి సంజయ్ ప్రశ్నించారు. అయోధ్య రాముడి అక్షింతలపై రాజకీయం...

Sanjay: అయోధ్యలో రాముడు పుట్టాడా.. లేదా..?.. పొన్నంకు బండి సంజయ్ సూటి ప్రశ్న..

రామమందిరం కట్టడం తప్పా ఒప్పా...? కాంగ్రెస్ నేతలు చెప్పాలని బీజేపీ లీడర్ బండి సంజయ్ ప్రశ్నించారు. అయోధ్య రాముడి అక్షింతలపై రాజకీయం విమర్శకుల విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. హనుమకొండ కొత్తకొండ వీరభద్రస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో రాముడు పుట్టాడా.. లేదా..? చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. అక్షింతల కార్యక్రమం బీజేపీ పార్టీది కాదని చెప్పారు. కేటీఆర్ కు ఉన్న అహంకారమే పొన్నం ప్రభాకర్ కూ ఉందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ వాళ్లు ఏది మాట్లాడితే పొన్నం అదే మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేటీఆర్ వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి పరిస్థితి వస్తుందో.. పొన్నం ప్రభాకర్ వల్ల కాంగ్రెస్ పార్టీకీ అదే పరిస్థితి వస్తుందని షాకింగ్ కామెంట్స్ చేశారు.

అధికారంలో ఉన్నాం కదా అని అహంకారంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ది చెప్తారని బండి సంజయ్ హెచ్చరించారు. కేంద్ర నాయకత్వం ఎక్కడ నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచే పోటీ చేస్తానన్నారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, కేంద్రంలో బీజేపీ 350 సీట్లకు పైగా గెలువబోతోందని స్పష్టం చేశారు.

Updated Date - Jan 14 , 2024 | 06:32 PM