Share News

Viral: భార్య పోయాక.. మామ ఇంట్లో సెటిలై.. చివరకు అత్తను మనువాడిన అల్లుడు!

ABN , Publish Date - Apr 30 , 2024 | 08:31 PM

భార్య పోయాక మామ ఇంట్లో సెటిలైన అల్లుడు చివరకు అత్తను మనువాడాడు. కుటుంబ విలువలనే ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన బీహార్‌లోని బంకా జిల్లాలో తాజాగా వెలుగు చూసింది.

Viral: భార్య పోయాక.. మామ ఇంట్లో సెటిలై.. చివరకు  అత్తను మనువాడిన అల్లుడు!

ఇంటర్నెట్ డెస్క్: భార్య పోయాక మామ ఇంట్లో సెటిలైన అల్లుడు చివరకు అత్తను మనువాడాడు. కుటుంబవిలువలనే ప్రశ్నార్థకం చేసిన ఈ ఘటన బీహార్‌లోని (Bihar) బంకా జిల్లాలో తాజాగా వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, సికందర్ యాదవ్ (45) కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య పోయాక అతడు తన అత్తమామలు దిలేశ్వర్ దార్వే, గీతా దేవీ (55) ఇంట్లో సెటిలయ్యాడు. ఇది చివరకు అత్త, అల్లుడిని దగ్గర చేసింది.

ఈ విషయం చివరకు మామ దిలేశ్వర్‌కు తెలిసింది. అల్లుడు చేసిన పనిని తట్టుకోలేక ఆయన.. గ్రామ పెద్దలను పిలిచి పంజాయితీ పెట్టాడు. చాలా సేపు చర్చోపచర్చల తరువాత దిలేశ్వర్, గ్రామపెద్దలు అత్తను అల్లుడికి ఇచ్చి కట్టపెట్టేందుకు నిర్ణయించారు. ఈ వివాహానికి దిలేశ్వర్ దగ్గరుండి మరీ అన్ని ఏర్పాట్లు చేశాడు. ఈ క్రమంలో సికిందర్ యాదవ్ , గీతాదేవి నుదుట సింధూరం పెడుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది.

Viral: మగ సింహం కళ్లల్లోకి గుచ్చిగుచ్చి చూశాడు.. ఆడ సింహం వచ్చి కాపాడకపోయి ఉంటే..


అయితే, గతంలో ఇలాంటి వింత ఘటనలు అనేకం వెలుగు చూశాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఓ వరుడు తనకు కాబోయే అత్త కట్టుతప్పిందని భావించి అప్పటికప్పుడు పెళ్లి రద్దు చేసుకున్నాడు. పెళ్లిమండపానికి వస్తుండగా అత్త సిగరెట్ తాగడం గమనించి కోపంతో ఊగిపోతూ అతడు పెళ్లి రద్దు చేసుకున్నాడు.

మరో ఘటనలో ఓ యువతి తనకు కాబోయే భర్త నిరక్షరకుక్షి అని గుర్తించి అప్పటికప్పుడు పెళ్లి క్యాన్సిల్ చేసింది. వరుడికి చదువబ్బలేదన్న విషయాన్ని దాచి పెట్టి అతడి తల్లిదండ్రులు సంబంధం కుదుర్చుకున్నారు. అయితే, వధువుకు అనుమానం రావడంతో వరుడిని రెండో ఎక్కం వల్లెవెయమని అగ్ని పరీక్ష పెట్టింది. ఈ పరీక్షలో అతడు విఫలమవుడంతో అతడి పెళ్లి బుగ్గిపాలయ్యింది.

Read Viral and Telugu News

Updated Date - May 02 , 2024 | 01:19 PM