Yadadri: వైభవంగా లక్ష్మీనారసింహుడి తిరుకల్యాణం
ABN, Publish Date - Mar 19 , 2024 | 01:34 PM
యాదగిరిగుట్ట: జగత్కల్యాణ కారకుడు, భక్తజనబాంధవుడు, ఆర్తత్రాణపరాయణుడు యాదగిరిగుట్ట లక్ష్మీనృసింహుడి బ్రహ్మోత్సవ తిరుకల్యాణ పర్వాలు సోమవారం రాత్రి వైభవంగా కొనసాగాయి. యాదగిరికొండపై ఉత్తర తిరుమాఢ వీధిలోని తాత్కాలిక బ్రహ్మోత్సవ కల్యాణ వేదికపై అంగరంగ వైభవంగా కల్యాణ తంతును అర్చకులు, వేదపండితులు నిర్వహించారు. వివిధ రకాల పుష్పా లు, అరటి, మామిడి తోరణాలు, రంగురంగుల విద్యుద్దీపాలతో అలంకరించిన కల్యా ణ వేదికపై అర్చకబృందం వేద మంత్రోచ్ఛారణ, ఆస్థాన విద్వాంసుల మంగళవాయిద్యాల నడుమ లక్ష్మీనరసింహుల కల్యాణం కన్నుల పండువగా సాగింది.
Updated at - Mar 19 , 2024 | 01:34 PM