Home » Bhuvanagiri
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్టపై ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు సెలవు రోజు కావడంతో భక్తులు పెద్దసంఖ్యలో వచ్చి లక్ష్మీనృసింహుడిని దర్శించుకున్నారు. దాదాపు 40వేల మంది భక్తులు క్షేత్ర దర్శనానికి రాగా ప్రత్యేక, ధర్మదర్శన క్యూలైన్లలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీ కొనసాగింది. వీఐపీ దర్శనానికి రెండు గంటలు, ధర్మదర్శనానికి మూడు గంటల సమయం పట్టింది.
నాయకుల వాహనాలంటేనే హడావుడి.. పదుల సంఖ్యలో కార్లు రయ్రయ్మంటూ దూసుకెళ్తుంటాయి.
లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీ అభ్యర్థిని పోటీలో నిలిపిన సీపీఎం(CPM).. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. ఇదే అంశంపై చర్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో సీపీఎం నేతలు శనివారం భేటీ అయ్యారు.
భువనగిరి: కేంద్రంలో బీజేపీ పదేళ్ల పాలన అంతా డొల్లని, తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశారని, వారి హయాంలో దేశం పరువు పోయిందని ‘సబ్కా సాత్.. సబ్కా వికాష్’ అని అన్నారని మరి అభివృద్ధి ఏదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ప్రశ్నించారు.
ప్రధాని నరేంద్ర మోదీ మేనియాతో కేంద్రంలో మూడోసారి అధికారం తమదేనన్న ధీమాతో ఉన్న కమలదళం నల్లగొండ స్థానంపై ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోంది..
భువనగిరి ఎంపీ టికెట్ బీసీలకు కేటాయించాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(MLA Komati Reddy Raj Gopal Reddy) అన్నారు. శుక్రవారం నాడు మునుగోడు క్యాంపు కార్యాలయంలో రాజ్ గోపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భువనగిరి ఎంపీగా తన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి పోటీ చేయడం లేదని పోటీ కోసం దరఖాస్తు చేయలేదని తేల్చిచెప్పారు.
యాదాద్రి: జగత్కల్యాణ కారకుడు, భక్తజనబాంధవుడు, ఆర్తత్రాణపరాయణుడు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి దేవస్థానంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమైన వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.
యాదాద్రి: తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొండపై నిద్రించే సౌకర్యాన్ని ఆలయ అధికారులు కల్పించారు. కొండపైన డార్మెటరీ హాల్ను ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ప్రారంభించారు.
యాదాద్రి: భక్తుల ఇలవేల్పు దైవం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మినరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా నాల్గవ రోజు గురువారం ఉదయం వట పత్ర శాయి అలంకార సేవలో లక్ష్మీనరసింహ స్వామి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
యాదగిరిగుట్ట, మార్చి 10: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సోమవారం ఉదయం 10గంటలకు ప్రధానాలయ ముఖ మండపంలో అర్చక, వేదపండితుల బృందం సంప్రదాయరీతిలో లక్ష్మీనృసింహుల తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.