Bhadradri: శ్రీరాముని పట్టాభిషేకం దృశ్యాలు..
ABN, Publish Date - Apr 19 , 2024 | 12:45 PM
భద్రాద్రి: శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా దక్షిణ అయోధ్య భద్రాచలం భక్తులతో సందడిగా మారింది. సీతారాముల కల్యాణం తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. పండితులు వేద మంత్రోచ్ఛరణలు ఆలపిస్తున్న వేళ రఘునందనుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. పట్టాభిషేకం మహోత్సవం సందర్బంగా ఉదయం నుంచే భద్రాచలం ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. కల్యాణమూర్తులు మిథిలా ప్రాంగణానికి చేరుకోగానే శ్రీరామనామ స్మరణతో ఆ ప్రాంతమంతా మార్మోగింది. గోదావరి నుంచి తీసుకొచ్చిన పుణ్య జలాలను భక్తులపై చల్లి అర్చకులు ఆశీస్సులు అందించారు. ప్రభుత్వం తరఫున గవర్నర్ రాధాకృష్ణన్..స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
1/7
శ్రీరామ మహా పట్టాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. పట్టాభిషిక్తుడు అయిన భద్రాద్రి రామయ్య..
2/7
సీతారామచంద్రస్వామి వారి మహా పట్టాభిషేకం కార్యక్రమంలో భాగంగా సీతారాములను పల్లకిలో ఊరేగింపుగా మిథిలా స్టేడియానికి తీసుకువస్తున్న దృశ్యం.
3/7
శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం సందర్బంగా రాముని మెడలో వేసే ముత్యాల హారం దండను భక్తులకు చూపిస్తున్న వేద పండితుడు..
4/7
శ్రీరామునికి ధరించే బంగారు కిరీటాన్ని భక్తులకు చూపుతున్న దృశ్యం..
5/7
శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్.. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న దృశ్యం
6/7
శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్.. ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న దృశ్యం
7/7
శ్రీ సీతారామచంద్రస్వామి వారి పట్టాభిషేకానికి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన గవర్నర్ రాధాకృష్ణన్కు తాంబూలం అందజేస్తున్న వేద పండితుడు..
Updated at - Apr 19 , 2024 | 02:46 PM