కేజీబీవీ విద్యార్థినిలను పరామర్శిస్తున్న మంత్రి రాజనర్సింహ
ABN, Publish Date - Oct 28 , 2024 | 10:52 AM
సంగారెడ్డి జిల్లా: న్యాల్కల్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (KGBV) కు చెందిన విద్యార్థినిలు దగ్గు, దమ్ము ఆయాసంతో అస్వస్థతకు గురై.. సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను మంత్రి దామోదర్ రాజనర్సింహ పరామర్శించారు. చికిత్స పొందుతున్న విద్యార్థినిలతో మాట్లాడారు. అస్వస్థతకు గురైనా విద్యార్థినులకు అండగా నిలిచారు. విద్యార్థినిలకు మెరుగైన వైద్యాన్ని అందించాల్సిందిగా డాక్టర్లను మంత్రి ఆదేశించారు.
1/5
అస్వస్థతకు గురై సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ విద్యార్ధిని పరామర్శిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ..
2/5
మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆస్పత్రిలో విద్యార్ధిని ఆరోగ్యపరిస్థితి అడిగి తెలుసుకుంటున్న దృశ్యం..
3/5
సెలైన్ ఎక్కిస్తున్న విద్యార్థిని వద్దకు వచ్చి పరామర్శిస్తున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ..
4/5
తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న విద్యార్ధినిని చూస్తున్న మంత్రి...
5/5
చికిత్స పొందుతున్న విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకుంటున్న మంత్రి దామోదర్ రాజనర్సింహ.. మెరుగైన చికిత్స అందించాలని ఆదేశం.
Updated at - Oct 28 , 2024 | 10:57 AM