ఆసిఫాబాద్ జిల్లా జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి
ABN, Publish Date - May 03 , 2024 | 08:55 AM
ఆసిఫాబాద్ జిల్లా: కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతోందని దీన్ని తిప్పికొట్టేందుకు అంతా సన్నద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా జిల్లాకేంద్రంలోని ప్రేమల గార్డెన్ సమీపంలో ఏర్పాటు చేసిన జనజాతర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. బీజేపీకి ఓటేస్తే మీ రిజర్వేషన్లు పోయినట్టేనని పేర్కొన్నారు. అంతా అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలో ప్రతి పది సంవత్సరాల కొకసారి జనాభా గణన చేసిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
1/6
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఆసిఫాబాద్ జిల్లా, ప్రేమల గార్డెన్ సమీపంలో ఏర్పాటు చేసిన జనజాతర బహిరంగ సభకు విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
2/6
పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లా, ప్రేమల గార్డెన్ సమీపంలో ఏర్పాటు చేసిన జనజాతర బహిరంగ సభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.
3/6
ఆసిఫాబాద్ జిల్లా, ప్రేమల గార్డెన్ సమీపంలో ఏర్పాటు చేసిన జనజాతర బహిరంగ సభకు విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి.. ప్రజలకు అభివాదం తెలుపుతున్న దృశ్యం.. ప్రక్కన ఎంపీ అభ్యర్థి సుగుణక్క..
4/6
ఆసిఫాబాద్ జిల్లా జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ఎంపీ అభ్యర్థి సుగుణక్క, మంత్రి సీతక్క, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్న దృశ్యం.
5/6
ఆసిఫాబాద్ జిల్లా జన జాతర సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణక్కకు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్న దృశ్యం.
6/6
ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి జనజాతర బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రజలు..
Updated at - May 03 , 2024 | 08:55 AM