Pawan: వైసీపీకి ఓటెందుకు వేయాలి? : పవన్ కల్యాణ్

ABN, Publish Date - Apr 29 , 2024 | 07:44 AM

కాకినాడ జిల్లా: గోదావరి జిల్లాల్లో కాపులకు, దళితులకు మధ్య చిచ్చు పెట్టాలనేదే సీఎం జగన్‌ కుయుక్తి అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో దున్నని భూమి, ఉండని ఇళ్లు.. అన్నీ జగన్‌ లాగేసుకుంటారని స్పష్టం చేశారు. కాపుల రిజర్వేషన్‌ ఉద్యమం వైసీపీ కనుసన్నల్లో జరిగిందని ధ్వజమెత్తారు. ఆ పార్టీ కీలకనేతల కనుసన్నల్లో తుని రైలు దహనం ఘటన జరిగిందని మండిపడ్డారు. వైసీపీకి ఓటేస్తే మనల్ని మనమే కిరోసిన్‌ పోసుకుని తగలబెట్టుకున్నట్లని హెచ్చరించారు. ఆదివారం కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం, జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో జరిగిన ప్రచార సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్‌ ప్రభుత్వానికి అసలు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు.

Pawan: వైసీపీకి ఓటెందుకు వేయాలి? : పవన్ కల్యాణ్ 1/6

కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడిలో జరిగిన వారాహి విజయభేరి సభకు విచ్చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జిల్లా నేతలు గజ మాలతో సన్మానిస్తున్న దృశ్యం.

Pawan: వైసీపీకి ఓటెందుకు వేయాలి? : పవన్ కల్యాణ్ 2/6

జనసేనాని పవన్ కల్యాణ్ జగ్గంపేట నియోజక వర్గం, కిర్లంపూడిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తున్న దృశ్యం.

Pawan: వైసీపీకి ఓటెందుకు వేయాలి? : పవన్ కల్యాణ్ 3/6

జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడిలో జరిగిన వారాహి విజయభేరి సభకు విచ్చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై అభిమానులు పూల వర్షం కురిపిస్తున్న దృశ్యం.

Pawan: వైసీపీకి ఓటెందుకు వేయాలి? : పవన్ కల్యాణ్ 4/6

ఆదివారం కాకినాడ జిల్లా పర్యటనకు వచ్చిన పవన్ కల్యాణ్.. కార్యకర్తలు, అభిమానులకు అభివాదం తెలుపుతున్న దృశ్యం..

Pawan: వైసీపీకి ఓటెందుకు వేయాలి? : పవన్ కల్యాణ్ 5/6

జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడిలో జరిగిన వారాహి విజయభేరి సభలో ప్రసంగిస్తున్న జనసేన నేతలు..

Pawan: వైసీపీకి ఓటెందుకు వేయాలి? : పవన్ కల్యాణ్ 6/6

కాకినాడ జిల్లా, జగ్గంపేట నియోజకవర్గం, కిర్లంపూడిలో పవన్ కల్యాణ్ నిర్వహించిన వారాహి విజయభేరి సభకు చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చిన ప్రజలు

Updated at - Apr 29 , 2024 | 07:44 AM