నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్..

ABN, Publish Date - May 23 , 2024 | 01:32 PM

నెల్లూరు జిల్లా: వెంకటాచలం మండలం, కాకుటూరులో ఉన్న విక్రమ సింహపురి యూనివర్శిటీలో బుధవారం జరిగిన స్నాతకోత్సవం కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులందరూ జీవితంలో నైతిక విలువలు పాటిస్తూ దేశం కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచంలో అపరిమితమైన అవకాశాలు, అపరిమిత సామర్థ్యాలను సద్వినియోగం చేసుకునే దిశగా ప్రయాణం సాగించాలని సూచించారు. జీవితంలో మనం సాధించిన డిగ్రీలు వ్యక్తిగత యోగ్యతకు నిదర్శనమని తెలిపారు. గత పదిహేనేళ్లుగా సమాజానికి సేవ చేయడంలో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం విశేషమైన పురోగతిని సాధించిందని గవర్నర్ వెల్లడించారు.

నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్.. 1/6

నెల్లూరు జిల్లా: కాకుటూరు, విక్రమ సింహపురి యూనివర్శిటీలో బుధవారం జరిగిన స్నాతకోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ గవర్నర్.. ప్రక్కన ఉన్నతవిద్యా మండలి చైర్మన్‌ హేమచంద్రారెడ్డి, వర్సిటీ విసి సుందరవల్లి..

నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్.. 2/6

విక్రమ సింహపురి యూనివర్శిటీ స్నాతకోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు పుష్పగుచ్చములిచ్చి స్వాగతం పలుకున్న వర్సిటీ విసి సుందరవల్లి..

నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్.. 3/6

విక్రమ సింహపురి యూనివర్శిటీ స్నాతకోత్సవం కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి ప్రసంతిస్తున్న గవర్నర్ అబ్దుల్ నజీర్‌..

నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్.. 4/6

గవర్నర్ అబ్దుల్ నజీర్.. వర్సిటీ విసి సుందరవల్లితో కలిసి విద్యార్థులకు గౌరవ పట్టాలు అందుజేస్తున్న దృశ్యం.

నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్.. 5/6

గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగాన్ని ఆసక్తిగా తిలికిస్తున్న విద్యార్ధులు..

నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్.. 6/6

గవర్నర్ చేత గౌరవ పట్టాలు అందుకున్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్న దృశ్యం..

Updated at - May 23 , 2024 | 01:33 PM