Home » University
Telangana: ఇక్ఫాయి ఘటనపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. లా విద్యార్థిని లేఖ్య వర్ధిని ఒంటిపై గాయాలపై ఇప్పటికీ స్పష్టత రాని పరిస్థితి. వాష్ రూమ్లో ఏం జరిగింది అనేది ఇప్పటికీ సస్పెన్సే. అసలు ఘటన ఎలా జరిగిందనే దానిపై యూనివర్సిటీ అధికాలు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. వేడినీళ్ళ కారణంగానే ఘటన జరిగిందని క్లారిటీ ఇవ్వలేము అంటూనే యాసిడ్ ఎటాక్ను యూనివర్సిటీ అధికారులు తోసిపుచ్చారు.
Telangana: శంకర్పల్లి ఇక్ఫాయ్ యూనివర్సిటీలో అనుమానాస్పద రీతిలో యువతి శరీరం కాలిన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. యూనివర్సిటీలో లా ఫైనల్ ఇయర్ చదువుతున్న లేఖ్య అనే విద్యార్థి యాసిడ్ దాడికి గురైనట్లు అనుమానలు వ్యక్తమవుతున్నాయి. తీవ్రంగా గాయపడిన యువతి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాలకు కొత్త ఉప కులపతులను (వీసీలు) నియమించేందుకు ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, మహత్మాగాంధీ, శాతవాహన, తెలంగాణ, అంబేడ్కర్, జేఎన్టీయూహెచ్, జేఎన్ఏఎ్ఫఏ యూనివర్సిటీల వీసీల పదవి కాలం ఈ నెల 21వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే.
ఒళ్లు గగుర్పొడిచే ఉదంతం ఉత్తరప్రదేశ్లోని(Uttarpradesh) ఓ యూనివర్సిటీలో మంగళవారం బయటపడింది. వాటర్ ట్యాంక్లో కుళ్లిన మృతదేహాన్ని గుర్తించడంతో.. లెక్చర్లర్లు, విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారు. కారణం.. ఆ నీటిని రెండు రోజులుగా వాడుతుండటం.
డిగ్రీలో సబ్జెక్టులు మిగిలిపోయిన విద్యార్థులకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని ఎస్కేయూ యాజమాన్యం నిర్ణయించింది. దీంతో పరీక్షల కోసం కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఊరట లభించింది. వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక సప్లిమెంటరీ పరీక్షలకు కొర్రీలు పెడుతూ వచ్చింది. దీంతో డిగ్రీ విద్యార్థులు ఫెయిల్ అయిన ఎస్కేయూ విద్యార్థులు సబ్జెక్టులను పూర్తిచేసుకోలేకపోయారు. ఈ సమస్యపై ఆంధ్రజ్యోతిలో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. అప్పటి వీసీ రామకృష్ణారెడ్డి తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఆయన వైసీపీ నాయకుడి తరహాలో ...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University) హాస్టల్లో విద్యార్థి సంఘాల మధ్య ఘర్షణ జరగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
లాలీపాల్లు కంటే తేలిగ్గా మాదకద్రవ్యాలు దొరుకుతున్నాయని, పోలీసులు మాత్రం మాదకద్రవ్యాల అక్రమ విక్రేతల జాడ తెలుసుకోవడంలో విఫలమవుతున్నారని ఓ యూనివర్శిటీ విద్యార్థి స్యయంగా పోలీసులకు క్లాస్ పీకాడు. డ్రగ్స్ బెడదను నిర్భీతగా పోలీసుల ముందే ఆ విద్యార్థి బయటపెట్టడాన్ని చూసి తోటి స్నేహితులు చప్పట్లతో హర్షాతిరేకం వ్యక్తం చేశారు.
Telangana Govt GO 55 Issue: తెలంగాణ రాజధాని హైదరాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఏబీవీపీ కార్యకర్తను జుట్టు పట్టి ఈడ్చారు మహిళా కానిస్టేబుల్స్. స్కూటీపై వెళ్తూ.. పరుగెడుతున్న విద్యార్థిని జుట్టు పట్టుకుని లాగారు. దాంతో ఆమె కింద పడిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందో వివరాలు తెలుసుకుందాం. Agriculture University
కేరళలోని కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (CUSAT)లో విషాదం చోటుచేసుకుంది. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన సంగీత కచేరీ సందర్భంగా భారీగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో నలుగురు విద్యార్థులు చనిపోగా.. 64 మంది గాయపడ్డారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది.
హనుమకొండ: కాకతీయ యూనివర్సిటీలో ఉద్రిక్తత నెలకొంది. వివిధ విభాగాలలోని పీహెచ్డి కేటగిరి-2 అడ్మిషన్లలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి.