Share News

Uttarakhand: ఛీ ఛీ మరీ ఇంత దారుణమా.. భార్యపై అనుమానంతో నోట్లో విద్యుత్ వైర్ పెట్టి మరీ..

ABN , Publish Date - Feb 11 , 2024 | 10:09 AM

తన పక్కనే నిద్రిస్తున్న 52 ఏళ్ల భార్యను విద్యుత్ వైర్ నోట్లో పెట్టి కరెంట్ షాక్‌కు గురయ్యేలా చేసి దారుణంగా హత్య చేసిన 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Uttarakhand: ఛీ ఛీ మరీ ఇంత దారుణమా.. భార్యపై అనుమానంతో నోట్లో విద్యుత్ వైర్ పెట్టి మరీ..

తన పక్కనే నిద్రిస్తున్న 52 ఏళ్ల భార్యను విద్యుత్ వైర్ నోట్లో పెట్టి కరెంట్ షాక్‌కు గురయ్యేలా చేసి దారుణంగా హత్య చేసిన 60 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ కొత్వాలి ప్రాంతంలో హమీద్ అనే అరవై ఏళ్ల వ్యక్తి తన భార్య ఖాతూన్, కుటుంబసభ్యులతో కలిసి నివాసముంటున్నాడు. వీరిద్దరికి కొన్ని నెలలుగా గొడవలు జరుగుతున్నాయి. తన భార్య వేరొకరితో సహజీవనం చేస్తోందని హమీద్ తరచూ వాగ్వాదానికి పాల్పడుతుండేవాడు. ఈ క్రమంలో శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో తన పక్కనే నిద్రిస్తున్న ఖాతూన్ ను హమీద్ దారుణంగా హత్య చేశాడు. విద్యుత్ కేబుల్‌ను ఖాతూన్ నోట్లో పెట్టి కరెంట్ షాక్ అయ్యేలా చేసి కర్కశంగా ప్రాణాలు తీశాడు. అనంతరం ఏమీ ఎరగనట్లు మృతదేహం పక్కనే నిద్రపోయాడు.

ఉదయం నిద్ర లేచిన తర్వాత తన తల్లి మృతి చెంది ఉండటాన్ని గమనించిన కుమారుడు మహ్మద్ నదీమ్ తండ్రిని ఆరా తీశాడు. అతని ప్రవర్తన అనుమనాస్పదంగా ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టుకుంటారనే భయంతో హమీద్ అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇన్‌ఫార్మర్ల ద్వారా పోలీసులు హమీద్ ను లంధోరాలో పట్టుకున్నారు. అతడిని అరెస్టు చేసి, హత్య చేసేందుకు ఉపయోగించిన వైర్‌ను స్వాధీనం చేసుకున్నారు.


పోలీసుల విచారణలో నిందితుడికి తన భార్యుపై అనుమానం ఉందని తేలింది. తద్వారా వారు గొడవలు పడేవారని తెలిసింది. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న హరిద్వార్ పోలీసులు మరింత సమాచారం రాబట్టేందుకు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 11 , 2024 | 10:10 AM