Share News

Madhya Pradesh: హాస్టల్‌లో విద్యార్థి మృతి.. ఏం జరిగిందంటే..?

ABN , Publish Date - May 19 , 2024 | 03:50 PM

పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహానికి సమీపంలో రక్తపు మరకలు కనిపించాయి. ఆ విద్యార్థి చీర కట్టుకొని, మేకప్ వేసుకొని, చేతులకు గాజులు వేసుకొని కనిపించాడు. కళ్లకు గంతలు కూడా కట్టుకొని ఉన్నాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

Madhya Pradesh: హాస్టల్‌లో విద్యార్థి మృతి.. ఏం జరిగిందంటే..?
student died

ఇండోర్: పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోన్న ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. మృతదేహానికి సమీపంలో రక్తపు మరకలు కనిపించాయి. ఆ విద్యార్థి చీర కట్టుకొని, మేకప్ వేసుకొని, చేతులకు గాజులు వేసుకొని కనిపించాడు. కళ్లకు గంతలు కూడా కట్టుకొని ఉన్నాడు. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.


ఎక్కడంటే..?

మధ్యప్రదేశ్ ఇండోర్‌లో పునీత్ దూబే అనే విద్యార్థి రంజిత్ సింగ్ కాలేజీలో బీఎస్సీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పునీత్ స్వస్థలం ఉదయ్ పుర.. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల కోసం గత రెండేళ్ల నుంచి ఇండోర్‌లో ఓ హాస్టల్‌లో ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ విగతజీవిగా మారాడు.


ఎప్పుడంటే..?

శుక్రవారం రాత్రి పునీత్ చనిపోయాడు. హాస్టల్ గదిలో తలుపు పెట్టుకొని ఉన్నాడు. తర్వాత చుట్టుపక్కల వారికి వాసన రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతిరోజు రాత్రి పునీత్ తన తల్లితో ఫోన్‌లో మాట్లాడేవాడట. శుక్రవారం ఫోన్ స్విచాఫ్ ఉండటంతో ఆ మరునాడు ఇండోర్‌లో ఉన్న స్నేహితులు, బంధువులకు పేరంట్స్ సమాచారం ఇచ్చారు. గది వద్దకు రాగా లోపల గడియ పెట్టి ఉంది. పోలీసులకు సమాచారం ఇచ్చారు.


తలుపు తెరచి చూడగా..

డోర్ ఓపెన్ చేసి చూడగా పునీత్ విగతజీవిగా కనిపించాడు. చీర కట్టుకొని ఉండటంతో ఆత్మహత్య, హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారులు వివరించారు. పునీత్ ల్యాప్ టాప్, మొబైల్ సీజ్ చేశారు. పునీత్ హాస్టల్ రూమ్ మేట్స్‌ను విచారిస్తున్నారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తల్లిదండ్రులకు అప్పగించారు.



Read Latest
National News and Telugu News

Updated Date - May 19 , 2024 | 03:50 PM