Share News

Sonia Gandhi: రాజ్యసభకు సోనియాగాంధీ పోటీ... ఎక్కడనుంచంటే..?

ABN , Publish Date - Feb 12 , 2024 | 06:20 PM

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజస్థాన్ నుంచి రాజ్యసభకు పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Sonia Gandhi: రాజ్యసభకు సోనియాగాంధీ పోటీ... ఎక్కడనుంచంటే..?

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) రాజస్థాన్ (Rajasthan) నుంచి రాజ్యసభ (Rajya Sabha)కు పోటీ చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలి లోక్‌సభ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాయబేరేలి కంచుకోటగా ఉన్నప్పటికీ ఈసారి సోనియాగాంధీ రాజ్యసభకు పోటీ చేస్తారనే ఊహాగానాలు కొద్దికాలంగా వినిపిస్తున్నాయి.


కాంగ్రెస్ పార్టీ నేత, న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ అభ్యర్థిగా కర్ణాటక నుంచి పోటీ చేస్తారని, సైయర్ నసీర్ హుస్సేన్‌కు తిరిగి టిక్కెట్ ఇస్తారని, అజయ్ మాకెన్‌కు కూడా రాజ్యసభకు నామినేట్ చేసే అవకాశాలున్నాయని వినిపిస్తోంది. ఒకటి రెండు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తమ రాజ్యసభ అభ్యర్థుల పేర్లను ప్రకటించనుంది.


రాజ్యసభ ఎన్నికలు

రాజ్యసభ ఎన్నికల తేదీని గత జనవరి 29న ఎన్నికల కమిషన్ ప్రకటించింది. వివిధ రాష్ట్రాల్లోని 56 రాజ్యసభ స్థానాలకు ఫిబ్రవరి 27న పోలింగ్ ఉంటుంది. అదే రోజు కౌంటింగ్ కూడా జరుగుతుంది. ఫిబ్రవరి 15వ తేదీతో నామినేషన్ల దాఖలు గడువు ముగియనుండగా, ఫిబ్రవరి 16న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ఫిబ్రవరి 20తో ముగుస్తుంది. ఫిబ్రవరి 27వ తేదీ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ పోలింగ్ జరిపి, 5 గంటలకు లెక్కింపు ప్రారంభిస్తారు.

Updated Date - Feb 12 , 2024 | 06:28 PM