Share News

Wife and Husband: రోజూ మందు, మాంసం ఇస్తానంటేనే వస్తా.. భర్తకు భార్య వింత షరతు..!

ABN , Publish Date - Mar 23 , 2024 | 11:09 AM

Rajasthan: భార్యభర్తల మధ్య గొడవలు జరిగి.. భార్య(Wife) తన పుట్టింటికి వెళ్లడం.. ఆ తరువాత భర్త(Husband) బ్రతిమాలి మళ్లీ తన ఇంటికి తీసుకెళ్లడం పలు సందర్భాల్లో జరుగుతుంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో పుట్టింటి నుంచి మెట్టినింటికి రావడానికి ఆ భార్య తన భర్తకు(Wife and Husband) కొన్ని కండీషన్స్ పెడుతుంటుంది.

Wife and Husband: రోజూ మందు, మాంసం ఇస్తానంటేనే వస్తా.. భర్తకు భార్య వింత షరతు..!
Wife and Husband

Rajasthan: భార్యభర్తల మధ్య గొడవలు జరిగి.. భార్య(Wife) తన పుట్టింటికి వెళ్లడం.. ఆ తరువాత భర్త(Husband) బ్రతిమాలి మళ్లీ తన ఇంటికి తీసుకెళ్లడం పలు సందర్భాల్లో జరుగుతుంటుంది. అయితే, కొన్ని సందర్భాల్లో పుట్టింటి నుంచి మెట్టినింటికి రావడానికి ఆ భార్య తన భర్తకు(Wife and Husband) కొన్ని కండీషన్స్ పెడుతుంటుంది. ఘర్షణలకు దిగకూడదనో.. మద్యం సేవించకూడదనో.. మరేదో డిమాండ్స్ భార్య, ఆమె కుటుంబ సభ్యులు(Family) చేస్తారు. కానీ, ఇక్కడ ఓ వ్యక్తి భార్య చేసిన డిమాండ్స్ విని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఆమె అత్తగారింటికి వెళ్లాలంటే.. తనకు రోజూ మద్యం, మాంసం ఏర్పాటు చేయాలట. అలాగైతేనే అత్తింటికి వెళ్తుందట.. లేదంటే వెళ్లనుగాక వెళ్లనని తేల్చి చెబుతోంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.

ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకుందాం. రాజస్థాన్‌లోని బన్స్వారా జిల్లా కుషాల్‌గఢ్‌కు చెందిన చిరాగ్.. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన నేహా జైన్ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇందుకోసం ఆమె కుటుంబానికి రూ. 2 లక్షలు కూడా ఇచ్చాడు. పెద్దల సమక్షంలో.. సంప్రదాయం ప్రకారం వీరి వివాహం ఘనంగానే జరిగింది. కానీ ఆ తరువాతే అసలు కథ మొదలైంది. నేహా తన అసలు రంగు బయటపెట్టింది. నేహా రోజూ ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడేది. ఇది గమనించిన భర్త.. ఫోన్‌లో ఎవరు? అని ప్రశ్నిస్తే కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నట్లుగా చెప్పేది. ఒక రోజు ఫోన్‌లో రీచార్జ్ అయిపోవడంతో.. ఆగ్రహించింది నేహా. నేరుగా వైన్ షాప్‌కి వెళ్లి మద్యం బాటిళ్లు తీసుకువచ్చింది. ఇంట్లోనే కూర్చుని అత్తమామల ముందే మందు తాగింది. ఈ ఘటనతో భర్త, అతని కుటుంబ సభ్యులు షాక్ అయ్యారు. ఇదేంటని ప్రశ్నిస్తే నేహ రివర్స్ ఫైర్ అయ్యింది. తనను ఎవరైనా అడ్డుకుంటే ఊరుకోనని, ఎక్కువ చేస్తే వేధిస్తున్నారంటూ పోలీస్ కంప్లైంట్ ఇస్తానని హెచ్చరించింది. దీంతో భర్త, అతని కుటుంబ సభ్యులు ఖంగుతిన్నారు.

ఆ తరువాత రక్షాబంధన్ రోజు పుట్టింటికి వెళ్లింది నేహా. అలా వెళ్లిన ఆమె.. మళ్లీ తిరిగి భర్త వద్దకు రాలేదు. కొద్ది రోజుల తరువాత చిరాగ్ తన భార్య ఇంటికి వెళ్లి.. ఆమెను తన ఇంటికి రావాల్సిందిగా కోరాడు. అయితే, ఆమె పలు డిమాండ్స్ చేసింది. ఆ డిమాండ్స్ విని చిరాగ్ షాక్ అయ్యాడు. నేహా అత్తింటికి రావాలంటే.. ఆమెకు రోజూ మద్యం, మాంసం ఏర్పాటు చేయాలట. అలాగైతేనే ఆమె మెట్టినింటికి వస్తుందట. ఈ డిమాండ్స్‌తో షాక్ అయిన భర్త.. ఇలా లాభం లేదనుకుని నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చాడు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 11:09 AM