Share News

Pune: ఆ కేసు ఖేల్ ఖతం.. యాక్సిడెంట్ చేసింది డ్రైవర్ అట..!!

ABN , Publish Date - May 23 , 2024 | 09:36 PM

పుణేలో నిర్లక్ష్యంగా కారు నడిపి, ఇద్దరు ప్రాణాలకు పోయేందుకు కారణమైన మైనర్ కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. ఆ రోజు కారు నడిపిన మైనర్ బాలుడిని పట్టుకొని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. గంటల్లో బెయిల్ రావడం.. తిరిగి జువైనల్ హోంకు తరలించడం చకచకా జరిగిపోయాయి. తాజాగా ఆ బాలుడు ఆ రోజు కారు తాను నడపలేదని కొత్త భాష్యం చెబుతున్నాడు. కారు డ్రైవ్ చేసింది ఫ్యామిలీ డ్రైవర్ అని వివరించారు.

Pune: ఆ కేసు ఖేల్ ఖతం.. యాక్సిడెంట్ చేసింది డ్రైవర్ అట..!!
PUNE TEEN

పుణే: పుణేలో నిర్లక్ష్యంగా కారు నడిపి, ఇద్దరు ప్రాణాలకు పోయేందుకు కారణమైన మైనర్ కేసు నుంచి తప్పించుకునేందుకు కొత్త ఎత్తుగడ వేశారు. ఆ రోజు కారు నడిపిన మైనర్ బాలుడిని పట్టుకొని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. గంటల్లో బెయిల్ రావడం.. తిరిగి జువైనల్ హోంకు తరలించడం చకచకా జరిగిపోయాయి. తాజాగా ఆ బాలుడు ఆ రోజు కారు తాను నడపలేదని కొత్త భాష్యం చెబుతున్నాడు. కారు డ్రైవ్ చేసింది ఫ్యామిలీ డ్రైవర్ అని వివరించారు. తానా అంటే తందానా అన్నట్టు ఆ డ్రైవర్ కూడా పోలీసుల ముందు నేరం అంగీకరించారు. కారు నడిపింది తానేనని ఒప్పుకున్నారు. దీంతో కేసు కొత్త మలుపు తిరగబోతుంది. కేసు విచారణ జరిగి, శిక్ష పడినప్పటికీ డ్రైవర్ అనుభవిస్తాడు. కేసు నుంచి ఎంచక్కా ఆ మైనర్ బాలుడు తప్పించుకునే అవకాశం ఉంది. ఆ బాలుడికి 25 ఏళ్లు వచ్చే వరకు లైసెన్స్ ఇవ్వమని పోలీసు శాఖ స్పష్టం చేసింది. కానీ మృతిచెందిన ఇద్దరికి మాత్రం న్యాయం జరగలేదు.



For More
National News and Telugu News..

Updated Date - May 23 , 2024 | 09:36 PM