Share News

Shatrughan Sinha: నామినేషన్ వేసిన షాట్‌గన్... టీఎంసీకి సరికొత్త రికార్డులు ఖాయమని ధీమా

ABN , Publish Date - Apr 23 , 2024 | 05:05 PM

బాలీవుడ్ నటుడు, సీనియర్ నేత శత్రుఘ్ను సిన్హా అసాంసోల్ లోక్‌సభ టీఎంసీ అభ్యర్థిగా మంగళవారంనాడు నామినేషన్ వేశారు. రాష్ట్ర ప్రజలు సరికొత్త రికార్డు స్థాయి విజయాన్ని టీఎంసీకి అందించనున్నారని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి సమాధానం చెప్పనున్నారని అన్నారు.

Shatrughan Sinha: నామినేషన్ వేసిన షాట్‌గన్... టీఎంసీకి సరికొత్త రికార్డులు ఖాయమని ధీమా

అసాంసోల్: బాలీవుడ్ నటుడు, సీనియర్ నేత శత్రుఘ్ను సిన్హా (Shatrughan Sinha) అసాంసోల్ (Asansol) లోక్‌సభ టీఎంసీ (TMC) అభ్యర్థిగా మంగళవారంనాడు నామినేషన్ (Nomination) వేశారు. రాష్ట్ర ప్రజలు సరికొత్త రికార్డు స్థాయి విజయాన్ని టీఎంసీకి అందించనున్నారని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓటర్లు ప్రధాని నరేంద్ర మోదీకి గట్టి సమాధానం చెప్పనున్నారని అన్నారు.

Lok Sabha polls 2024: హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగా చూశారు: మోదీ


''ప్రధానమంత్రి ఏదో కాకతాళీయంగా కాకుండా అభ్యంతకరమైన భాష వాడుతున్నారు. గత పర్యాయం కూడా 'దీదీ, ఓ దీదీ' అంటూ సీఎంను పరిహసిస్తూ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలు అందుకు తగిన గుణపాఠం చెప్పారు. ఈసారి కూడా బెంగాల్ ప్రజలు గత రికార్డులను తిరగరాస్తూ ఘన విజయం అందించడం, మోదీకి గుణపాఠం చెప్పడం ఖాయం'' అని సిన్హా చెప్పారు. మమతా బెనర్జీ చేసిన అభివృద్ధి పనులే టీఎంసీకి ఘ న విజయాన్ని కట్టబెడతాయని అన్నారు. టీఎంసీ రోడ్డుషోలకు వస్తున్న స్పందన, ప్రజలు చూపిస్తున్న ప్రేమ అసాధారణంగా ఉందన్నారు. మమతాబెనర్జీ, టీఎంసీ గెలుపు ఖాయమని అన్నారు. రాష్ట్రానికి, ప్రజలకు మమతా బెనర్జీ చేసిన సేవలు, అభివృద్ధి పనులు ఏ సీఎం చేయలేదని, కనీసం ప్రధానికి కూడా చేసిచూపించలేదని చెప్పారు. 42 లోక్‌సభ స్థానాలున్న పశ్చిమబెంగాల్‌లో మొత్తం ఏడు దశల్లో పోలింగ్ జరుగుతోంది. ఏప్రిల్ 19న తొలివిడత పోలింగ్ పూర్తికాగా, మలివిడతలుగా ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న పోలింగ్ జరుగనుంది.

Read Latest National News and Telugu News

Updated Date - Apr 23 , 2024 | 05:08 PM