Share News

Kolkata: బెంగాల్‌ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్న బీజేపీ.. ఘాటుగా స్పందించిన దీదీ

ABN , Publish Date - Apr 12 , 2024 | 06:09 PM

పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) శాంతి నెలకొంటే బీజేపీ(BJP) సహించదని సీఎం మమతా బెనర్జీ(CM Mamata Benerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరం బ్లాస్ట్ నిందితులను ఎన్ఐఏ కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్న తరువాత బీజేపీ నేతలు బెంగాల్ సురక్షిత ప్రాంతం కాదని ఆరోపించారు.

Kolkata: బెంగాల్‌ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్న బీజేపీ.. ఘాటుగా స్పందించిన దీదీ

కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) శాంతి నెలకొంటే బీజేపీ(BJP) సహించదని సీఎం మమతా బెనర్జీ(CM Mamata Benerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరం బ్లాస్ట్ నిందితులను ఎన్ఐఏ కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్న తరువాత బీజేపీ నేతలు బెంగాల్ సురక్షిత ప్రాంతం కాదని ఆరోపించారు.

రాష్ట్రం ఉగ్రవాదులకు స్వర్గధామంగా నిలిచిందని బీజేపీ శాసనసభా పక్ష నేత సువేందు అధికారి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై దీదీ ఘాటుగా స్పందించారు. కూచ్‌బెహార్‌లో శుక్రవారం జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచార ర్యాలీలో మమత మాట్లాడారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, గుజరాత్‌, బిహార్‌ సురక్షిత రాష్ట్రాల అని బీజేపీని ఆమె ప్రశ్నించారు.

Bengaluru: రామేశ్వరం కేఫ్‌లో పేలుడు: సూత్రధారులు అరెస్ట్

దీదీ మాట్లాడుతూ.. ‘బీజేపీకి ఒక ప్రొపగాండా స్పెషలిస్ట్‌ ఉన్నాడు. బెంగళూరులో రామేశ్వరం కేఫ్‌ పేలుడు జరిగింది. నిందితులు కర్ణాటకకు చెందిన వారు. వారు పారిపోయి వచ్చి బెంగాల్‌లో దాక్కున్నారు. అయినా వారిని మా ప్రభుత్వం కేవలం రెండు గంటల్లోనే పట్టుకుంది’అని మమత తెలిపారు. రామేశ్వరం కేఫ్‌ పేలుడు నిందితులను ఎన్‌ఐఏ(NIA) బెంగాల్‌లో శుక్రవారం అరెస్టు చేసింది.


నిందితులను పట్టుకున్నారిలా..

రామేశ్వరం పేలుడు సూత్రధారి అబ్దుల్ మతీన్ తహాతో పాటు ఈ బాంబు అమర్చిన ముసావీర్ హుస్సేన్‌ను కొల్‌కత్తాలో అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఎన్ఐఏ అధికారులు శుక్రవారం వెల్లడించారు. బెంగళూరులో ఐసిస్‌కు సంబంధించిన కేసులో అబ్దుల్ మతీన్ తాహా ప్రమేయం ఉందని ఈ సందర్బంగా వారు గుర్తు చేశారు. 2020 టెర్రరిజం కేసులో వీరిద్దరి ప్రమేయం ఉందన్నారు. వీరిద్దరు నకిలీ దృవపత్రాలు సృష్టించుకొన్నారని.. మహ్మద్ జునెద్ సయ్యదు పేరు షాజిద్‌గాను, అలాగే తాహా హిందువు విఘ్నేష్ పేరుతో ఆధార్ కార్డు రూపొందించుకున్నారని వివరించారు. ఈ పేలుడుకు పాల్పడిన ఈ ఇద్దరు వ్యక్తులు ఆచూకి తెలిపితే ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇస్తామని.. అందుకు సంబంధిన నిందితుల ఫోటోలను విడుదల చేసి.. ఎన్ఐఏ రివార్డు ప్రకటించిన విషయం తెలిసిందే.

అయతే ఈ పేలుడులో ప్రధాన నిందితుడుకి సహకరించారనే విచారణలో తేలడంతో... చిక్‌మంగళుర్‌కు చెందిన ముజామిల్ షరీప్‌ను గత నెలలో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అయితే ఈ పేలుళ్లులో నిందితులను అరెస్ట్ చేయడానికి కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతోపాటు పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కర్ణాటక, కేరళ పోలీసుల సహకారాన్ని తీసుకున్నట్లు ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది, మార్చి 1వ తేదీ బెంగళూరులోని బ్రూక్ ఫీల్డ్ ప్రాంతంలో రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 10 మంది వ్యక్తులు గాయపడ్డారు. ఈ పేలుళ్లపై ఎన్ఐఏ విచారణ చేపట్టింది. అందులోభాగంగా సదరు కేఫ్‌లో ఏర్పాటు చేసిన సీసీ ఫుటేజ్‌లను పరిశీలించింది.ఒక వ్యక్తి బ్యాగ్‌తో కేఫ్‌కు రావడం.. అతడు టిఫిన్‌కు ఆర్డర్ ఇవ్వడం.. ఆ తర్వాత అతడు ఆ టిఫిన్ తినకుండానే అక్కడి నుంచి వెళ్లిపోవడం.. అలా అతడు వెళ్లిన కొన్ని నిమిషాలకే కేఫ్‌లో పేలుడు సంభవించినట్లు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. ఇక ఈ పేలుడు సంభవించిన తర్వాత.. కేఫ్‌కు వచ్చిన వ్యక్తి పలుమార్లు తన దుస్తులు మార్చినట్లు ఎన్ఐఏ అదికారులు పేర్కొన్నారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2024 | 06:14 PM