బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో వృద్ధురాలి మృతి

ABN , First Publish Date - 2023-01-10T00:36:27+05:30 IST

కూతుర్ని అల్లుడిని చూసేందుకు వస్తున్న వృద్ధురాలు మార్గమధ్యలో తాను ప్రయాణిస్తున్న బస్సులో గుండెపోటుకు గురైంది.

	బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో వృద్ధురాలి మృతి

తెనాలి రూరల్‌, జనవరి 9: కూతుర్ని అల్లుడిని చూసేందుకు వస్తున్న వృద్ధురాలు మార్గమధ్యలో తాను ప్రయాణిస్తున్న బస్సులో గుండెపోటుకు గురైంది. సత్తెనపల్లి సుగాలి కాలనీకి చెందిన ఎల్‌.బిక్కుబాయి(65) కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. సోమవారం దుగ్గిరాల్లో ఉంటున్న తన కూతురు, అల్లుడును చూసేందుకు గుంటూరు చేరుకుని అక్కడి నుంచి నందివెలుగు వచ్చేందుకు ఆర్టీసీబస్సు ఎక్కింది. హాఫ్‌పేట గ్రామం శివారులోకి రాగానే ఆమెకు గుండెపోటు రావడంతో తోటి ప్రయాణీకులు గమనించి బస్సు డ్రైవర్‌ కండెక్టర్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో బస్సును కొలకలూరు గ్రామంలోని పీహెచ్‌సీకి తీసువచ్చారు. ఆపస్మారక స్థితిలో ఉన్న ఆ వృద్ధురాలిని డాక్టర్లు పరిశీలించగా మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

Updated Date - 2023-01-10T00:36:30+05:30 IST