Share News

Maratha Reservation Bill: మరాఠా కోటా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ABN , Publish Date - Feb 20 , 2024 | 03:39 PM

మహారాష్ట్రలో మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యాగావకాశాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహారాష్ట్ర రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా కమ్యూనిటీకి 10 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లును ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సభలో ప్రవేశపెట్టారు.

Maratha Reservation Bill: మరాఠా కోటా బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

ముంబై: మహారాష్ట్ర (Maharashtra)లో మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యాగావకాశాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఉద్దేశించిన మహారాష్ట్ర రిజర్వేషన్ బిల్లు (Maratha Reservation Bill)కు రాష్ట్ర అసెంబ్లీ మంగళవారంనాడు ఆమోదం తెలిపింది. విద్యా సంస్థలు, ఉద్యోగాల్లో మరాఠా కమ్యూనిటీకి 10 శాతం రిజర్వేషన్ కల్పించే ఈ బిల్లును ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే సభలో ప్రవేశపెట్టారు. రిజర్వేషన్ అమలైనప్పటి నుంచి పదేళ్ల తర్వాత దీనిపై సమీక్షకు ఈ బిల్లు వీలు కల్పిస్తోంది.


మహారాష్ట్ర వెనుకబడిన తరగతుల కమిషన్ సుమారు 2.5 కోట్ల కుటుంబాల సామాజిక స్థితిగతులపై ఇటీవల సర్వే జరిపి నివేదికను అందజేసింది. మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించడం సమంజసమేనని నివేదిక పేర్కొంది. రాష్ట్ర జనాభాలో మరాఠా కమ్యూనిటీకి చెందిన వారు 28 శాతం ఉన్నారని, 21.22 శాతం ఎల్లో రేషన్ కార్డులతో దాదాపు మరాఠా కుటుంబాలన్నీ దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వం ఈ ఏడాది ప్రారంభంలో జరిపిన సర్వేలోనూ 84 శాతం మరాఠా కుటుంబాలు ప్రొగ్రసివ్ క్యాటగిరిలో లేవని తేలింది. ఇంద్ర సాహనీ కేసు కింద వీరంతా రిజర్వేషన్ ప్రయోజనాలకు అర్హులని సర్వే స్పష్టం చేసింది.


ప్రస్తుత రిజర్వేషన్‌‌ కోటా జోలికి వెళ్లకుండానే..

కాగా, ప్రస్తుతం ఇతర కమ్యూనిటీలకు వర్తిస్తున్న రిజర్వేషన్ కోటాకు భంగం కలుగకుండానే మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే గత వారంలో ప్రకటించారు. అయినప్పటికీ, మరాఠా కమ్యూనిటీని ఓబీసీ క్యాటగిరిలో చేర్చడంపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. మరోవైపు, మరాఠా కమ్యూనిటీకి రిజర్వేషన్ల విషయంలో న్యాయపోరాటాలు కూడా చోటుచేసుకున్నాయి. కాలేజీ అడ్మిషన్లు, ఉద్యగాల్లో మరాఠీ ప్రజలకు రిజర్వేషన్లు కల్పించడం చెల్లనేరదని 2021లో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనివార్య పరిస్థితుల్లోనే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతాన్ని దాటి రిజర్వేషన్లు ఉండరాదని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.

Updated Date - Feb 20 , 2024 | 03:42 PM