Share News

Kolkata: ప్రియుడిని హతమార్చి, ఆపై పోలీసులకు ఫోన్ చేసిన మహిళ

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:08 PM

కోల్ కతా డమ్ డమ్ ఏరియాలో సంహతి పాల్ అనే మేకప్ ఆర్టిస్ట్ ఉంటోంది. ఆమెకు సార్ధక్ దాస్ అనే ఫొటోగ్రాఫర్‌తో వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరి మధ్య ఇటీవల గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రోజున సార్ధక్ దాస్‌‌పై సంహతి పాల్ కత్తితో విచక్షణరహితంగా దాడి చేసింది. దాంతో అతను కుప్పకూలిపోయాడు.

Kolkata: ప్రియుడిని హతమార్చి, ఆపై పోలీసులకు ఫోన్ చేసిన మహిళ

కోల్ కతా: ఏం జరిగిందో తెలియదు.. ప్రియుడిని కసితీరా పొడిచేసింది ఆ మహిళ (woman). హత్య చేసి, ఆ తర్వాత పోలీసులకు (police) ఫోన్ చేసింది. అధికారులు వచ్చి చూడగా అతడు విగతజీవిగా పడి ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా చనిపోయాడని వైద్యులు ధృవీకరించారు.

కోల్ కతా డమ్ డమ్ ఏరియాలో సంహతి పాల్ అనే మేకప్ ఆర్టిస్ట్ ఉంటోంది. ఆమెకు సార్ధక్ దాస్ అనే ఫొటోగ్రాఫర్‌తో వివాహేతర సంబంధం ఉంది. వీరిద్దరి మధ్య ఇటీవల గొడవ జరుగుతున్నాయి. బుధవారం రోజున సార్ధక్ దాస్‌‌పై సంహతి పాల్ కత్తితో విచక్షణరహితంగా దాడి చేసింది. దాంతో అతను కుప్పకూలిపోయాడు. పోలీసులకు ఫోన్ చేసి జరిగిన విషయాన్ని చెప్పింది సంహతి పాల్. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే అతను అచేతనంగా ఉన్నాడు. ఆస్పత్రికి తరలించగా చనిపోయాడని వైద్యులు నిర్ధారించారు. వారిద్దరి మధ్య గొడవకు గల కారణం..? హత్య చేయడానికి గల కారణం ఇంకా తెలియరాలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 05:08 PM