Share News

PM Modi: రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఎందుకు..? కేరళ సీఎం అభ్యంతరం

ABN , Publish Date - Feb 12 , 2024 | 12:10 PM

రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని కేరళ సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఆ ఆదేశాలను కేరళ సీఎం పినరయి విజయన్ తప్పు పట్టారు.

PM Modi: రేషన్ షాపుల్లో మోదీ ఫొటో ఎందుకు..? కేరళ సీఎం అభ్యంతరం

తిరువనంతపురం: రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫొటో పెట్టాలని కేరళ సర్కార్‌ను కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. షాపుల మందు బ్యానర్లు ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. ఈ అంశం గురించి కేరళ అసెంబ్లీలో ఓ సభ్యుడు ప్రశ్న వేశారు. దానికి కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) సమాధానం ఇచ్చారు. రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టాలనే ఆదేశాలు వచ్చాయని తెలిపారు. ఆ ఆదేశాలు సరికాదని, వాటిని అమలు చేయబోమని సభకు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ప్రభుత్వం రేషన్ బియ్యం అందజేస్తోంది. ఆ క్రమంలో ప్రధాని మోదీ ఫొటో పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. వాటిని అమలు చేయడం కష్టం అని కేరళ సీఎం విజయన్ తేల్చిచెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 12 , 2024 | 12:10 PM