Share News

Kanimozhi: కనిమొళి సంచలన కామెంట్స్.. మోదీ - షా ద్వయాన్ని చూస్తే ఆ మాజీసీఎం గజగజ వణికిపోతారు...

ABN , Publish Date - Apr 10 , 2024 | 08:06 AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల ద్వయాన్ని చూస్తేనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి(Former Chief Minister Edappadi K. Palaniswami) గజగజ వణికిపోతారని డీఎంకే మహిళా నేత, తూత్తుక్కుడి డీఎంకే లోక్‌సభ అభ్యర్థి కనిమొళి(Kanimozhi) అన్నారు.

Kanimozhi: కనిమొళి సంచలన కామెంట్స్.. మోదీ - షా ద్వయాన్ని చూస్తే ఆ మాజీసీఎం గజగజ వణికిపోతారు...

- కనిమొళి

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాల ద్వయాన్ని చూస్తేనే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి(Former Chief Minister Edappadi K. Palaniswami) గజగజ వణికిపోతారని డీఎంకే మహిళా నేత, తూత్తుక్కుడి డీఎంకే లోక్‌సభ అభ్యర్థి కనిమొళి(Kanimozhi) అన్నారు. కొళత్తూరులో జరిగిన బహిరంగ సభలో ఆమె పాల్గొని ప్రసంగిస్తూ, ఇపుడు జరిగేవి లోక్‌సభ ఎన్నికలు మాత్రమే.. కానీ, ఇవి అసెంబ్లీ ఎన్నికలుగా భావించి ఎడప్పాడి కె.పళనిస్వామి తమను లక్ష్యంగా చేసుకుని అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. ఆయన ఆరోపణలకు తాము దీటుగానే కౌంటర్‌ ఇస్తున్నామన్నారు. ఎంకే స్టాలిన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొళత్తూరు అసెంబ్లీ అభివృద్ధికి ఏం చేయలేదని ఎడప్పాడి పదేపదే ఆరోపిస్తున్నారు. నిజానికి సీఎం హోదాలో స్టాలిన్‌ ఈ నియోజకవర్గానికి మూడుసార్లు వచ్చారని పేర్కొన్నారు. ఇప్పటివరకు మోడీ, అమిత్‌షాను ఏ సభలో అయినా ఎడప్పాడి విమర్శించారా అని ఆమె ప్రశ్నించారు.

ఇదికూడా చదవండి: BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్ సంచలన కామెంట్స్.. ఆపార్టీ ఓ ఆరిపోయే దీపం..!

Updated Date - Apr 10 , 2024 | 08:06 AM