Share News

Doordarshan: కాషాయ రంగులోకి దూరదర్శన్‌ లోగో..

ABN , Publish Date - Apr 20 , 2024 | 01:21 PM

భారత ప్రభుత్వ నిర్వహణలోని దూరదర్శన్‌ చానెల్‌(Doordarshan) తన లోగోను(Doordarshan Logo) మార్చుకుంది. సంస్థ ప్రారంభమైన నాటి నుంచి ఎరుపు రంగులో ఉన్న లోగో తాజాగా కాషాయంలోకి(Orange) మారింది. ఏప్రిల్‌ 16 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు సోషల్‌ మీడియా ద్వారా డీడీ న్యూస్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా...

Doordarshan: కాషాయ రంగులోకి దూరదర్శన్‌ లోగో..
Doordarshan New Logo

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 20: భారత ప్రభుత్వ నిర్వహణలోని దూరదర్శన్‌ చానెల్‌(Doordarshan) తన లోగోను(Doordarshan Logo) మార్చుకుంది. సంస్థ ప్రారంభమైన నాటి నుంచి ఎరుపు రంగులో ఉన్న లోగో తాజాగా కాషాయంలోకి(Orange) మారింది. ఏప్రిల్‌ 16 నుంచి ఇది అమల్లోకి వచ్చినట్లు సోషల్‌ మీడియా ద్వారా డీడీ న్యూస్‌ ప్రకటించింది. ఈ సందర్భంగా... లోగో మారింది తప్ప చానెల్‌ విలువల్లో ఎలాంటి మార్పు లేదని తెలిపింది. ‘‘వేగం కంటే కచ్చితత్వాన్ని, అబద్ధాల కంటే నిజాన్ని, సంచలనాల కంటే సత్యాన్ని మాత్రమే ముందుంచే దూరదర్శన్‌... తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది’’ అని పోస్ట్‌ చేసింది.

ఇవికూడా చదవండి:

నిరంతరం రాష్ట్రం గురించే చంద్రబాబు ఆలోచన

సూపర్ ఫామ్‌లో ఉన్న ధోనీ ముందుగా ఎందుకు రావడం లేదు?

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 20 , 2024 | 01:21 PM