Share News

Delhi: డైనోసర్లలాగే కాంగ్రెస్ అంతరిస్తుంది.. రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 12 , 2024 | 04:45 PM

కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని.. లోక్ సభ ఎన్నికలు కాగానే ఆ పార్టీ డైనోసర్లలా అంతరించిపోతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Delhi: డైనోసర్లలాగే కాంగ్రెస్ అంతరిస్తుంది.. రాజ్‌నాథ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు

ఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావ అని.. లోక్ సభ ఎన్నికలు కాగానే ఆ పార్టీ డైనోసర్లలా అంతరించిపోతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్(Rajnath Singh) ఘాటు వ్యాఖ్యలు చేశారు.

ఉత్తరాఖండ్‌ బీజేపీ అభ్యర్థి అనిల్ బలూనీకి మద్దతుగా శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రాజ్ నాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "ఆ పార్టీలో ఉంటే రాజకీయ జీవితం ఉండదనే అనేక మంది నేతలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరుతున్నారు.


రానున్న రోజుల్లో కాంగ్రెస్ అనే అతి పురాతన జాతీయ పార్టీ పూర్తిగా అంతరించిపోతుంది. డైనోసర్‌లా అంతరించిపోతుందేమోనని నేనూ భయపడుతున్నా.

కాంగ్రెస్ నేతలు బిగ్ బౌస్ హౌస్‌లో కంటెస్టంట్ల వంటి వారు. వారు రోజూ ఒకరితో ఒకరు గొడవ పడుతుంటారు. బట్టలు చించుకుంటారు. చివరికి ఆ పార్టీని చిన్నపిల్లలు కూడా గుర్తించలేరు. బుల్లితెర బిగ్ బాస్‌లా మారింది వారి పరిస్థితి" అని ఎద్దేవా చేశారు.

PM Modi: బుజ్జగింపు రాజకీయాలకు కేరాఫ్ కాంగ్రెస్.. ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 12 , 2024 | 04:47 PM