Share News

ECI: ఈశన్యాన బీజేపీ తొలి విజయం.. కాషాయపార్టీకి ఆ రాష్ట్రం నల్లేరు నడకే

ABN , Publish Date - Jun 02 , 2024 | 12:03 PM

సిక్కింలో అధికారంలో ఉన్న క్రాంతికారీ మోర్చా(SKM) సిక్కింలో క్లీన్ స్వీప్ అంచున ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.

ECI: ఈశన్యాన బీజేపీ తొలి విజయం.. కాషాయపార్టీకి ఆ రాష్ట్రం నల్లేరు నడకే

  • సిక్కిం పీఠం మరోసారి క్రాంతికారీ మోర్చాదే!

ఢిల్లీ: సిక్కింలో అధికారంలో ఉన్న క్రాంతికారీ మోర్చా(SKM) సిక్కింలో క్లీన్ స్వీప్ అంచున ఉండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది. మధ్యాహ్నం 12.20 నిమిషాల వరకు ఉన్న సమాచారం ప్రకారం.. 60 స్థానాలున్న అరుణాచల్‌లో మెజారిటీ 31 స్థానాలుకాగా బీజేపీ ఇప్పటికే 28 సీట్లలో గెలుపొందింది.19 స్థానాల్లో లీడ్‌లో ఉంది. ఆ పార్టీ అంతకుముందే 10 స్థానాల్లో ఏకగ్రీవంగా గెలుపొందింది.

సిక్కింలో SKM ఏడు స్థానాలను గెలుచుకుంది. 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ (NPP) అరుణాచల్ ప్రదేశ్‌లో రెండు స్థానాలు గెలుచుకోగా, మూడు చోట్ల లీడ్ లో ఉంది. స్వతంత్య్ర అభ్యర్థులు 5 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, 2 స్థానాల్లో గెలుపొందారు. సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ (SDF) ఒక స్థానంలో ఆధిక్యంలో ఉంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో ఏప్రిల్ 19న ఓటింగ్ జరిగింది. సిక్కింలో మొత్తం ఓటింగ్ శాతం 79.88 కాగా, అరుణాచల్ ప్రదేశ్‌లో 82.95 శాతం జరిగింది. సిక్కింలో అధికార SKM, ప్రతిపక్ష SDF మధ్య కీలక పోటీ నెలకొంది.


అక్కడ పోటీలో ఉన్న 146 మంది అభ్యర్థుల్లో ప్రముఖులు ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, ఆయన భార్య కృష్ణ కుమారి రాయ్, మాజీ ముఖ్యమంత్రి పవన్ కుమార్ చామ్లింగ్, మాజీ భారత ఫుట్‌బాల్ క్రీడాకారుడు భైచుంగ్ భూటియా, బీజేపీకి చెందిన నరేంద్ర కుమార్ సుబ్బా ఉన్నారు. ఎస్‌కేఎం, ఎస్‌డీఎఫ్ 32 మంది అభ్యర్థులను నిలబెట్టగా, బీజేపీ 31 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేయగా, సిటిజన్ యాక్షన్ పార్టీ-సిక్కిం 30 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది.


2019లో, ప్రేమ్ సింగ్ తమాంగ్ నేతృత్వంలోని SKM 17 సీట్లు గెలుచుకోగా, SDF 15 సీట్లు గెలుచుకుంది. 60 మంది సభ్యుల అరుణాచల్ అసెంబ్లీలో అధికార బీజేపీ, కాంగ్రెస్ మధ్యే కీలక పోరు నెలకొంది. బీజేపీ మొత్తం 60 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టగా, కాంగ్రెస్ 19 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది.

నేషనల్ పీపుల్స్ పార్టీ (NPEP), నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) కూడా అభ్యర్థులను నిలబెట్టాయి. బొమ్‌డిలా, చౌక్‌మ్‌, హయులియాంగ్‌, ఇటానగర్‌, ముక్తో, రోయింగ్‌, సాగలీ, తాలి, తలిహా, జిరో-హపోలీ నియోజకవర్గాల్లో ఇతర అభ్యర్థులెవరూ నామినేషన్‌ దాఖలు చేయకపోవడంతో బీజేపీ10 స్థానాల్లో ఏకపక్ష విజయం సాధించింది.

For Latest News and National News click here..

Updated Date - Jun 02 , 2024 | 02:35 PM