Share News

BJP state president: జైలు నుంచే సెంథిల్‌ బాలాజి డైరెక్షన్‌ చేస్తున్నారు...

ABN , Publish Date - Apr 09 , 2024 | 10:36 AM

జైలు నుంచే ప్రతిరోజు సెల్‌ఫోన్‌లో ఎన్నికల ప్రచారం, వ్యూహాల గురించి మంత్రులను సెంథిల్‌ బాలాజి దిశానిర్దేశం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపించారు.

BJP state president: జైలు నుంచే సెంథిల్‌ బాలాజి డైరెక్షన్‌ చేస్తున్నారు...

చెన్నై: జైలు నుంచే ప్రతిరోజు సెల్‌ఫోన్‌లో ఎన్నికల ప్రచారం, వ్యూహాల గురించి మంత్రులను సెంథిల్‌ బాలాజి దిశానిర్దేశం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపించారు. కోయంబత్తూర్‌లో అన్నామలై మీడియాతో మాట్లాడుతూ... ప్రచారం కోసం జైలు నుంచే కథ, మాట లు, స్ర్కీన్‌ప్లే రాసి అందిస్తున్నది సెంథిల్‌ బాలాజి అన్నారు. ఈసారి డీఎంకే ఎన్ని అడ్డదారులు తొక్కినా కోవైలో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. పోలయ్యే ఓట్లలో 60 శాతం బీజేపీకి దక్కుతాయన్నారు. తాంబరం రైలులో పట్టుబడిన రూ.4 కోట్ల నగదుకు తనకు ఎలాంటి సంబంధం లేదని నయినార్‌ నాగేంద్రన్‌ చెబుతున్నా, ప్రతిపక్షాలు ఈ వ్యవహారాన్ని రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. ఈ వ్యవహారంలో తగిన విచారణ చేపట్టాలని తాము కూడా కోరామన్నారు. రాష్ట్రంలో కనీసం 4 అంతర్జాతీస్థాయి క్రీడా మైదానాలు అవసరమన్నారు. క్రీడా మైదానాలు కావాలంటే తొలుత రోడ్లు బాగు చేయాలని అన్నామలై సూచించారు.

ఇదికూడా చదవండి: Minister Udayanidhi: స్టాలిన్‌ ప్రతిపాదించే వ్యక్తే ప్రధాని అవుతారు...

Updated Date - Apr 09 , 2024 | 10:36 AM