Share News

BJP Third List: బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీ చేస్తున్నది ఇక్కడి నుంచే..

ABN , Publish Date - Mar 21 , 2024 | 06:46 PM

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP) తన అభ్యర్థుల మూడో జాబితాను(BJP Third List) విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు(Tamil Nadu) సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. ఇటీవల తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైని..

BJP Third List: బీజేపీ మూడో జాబితా విడుదల.. తమిళిసై పోటీ చేస్తున్నది ఇక్కడి నుంచే..
BJP Third List

Lok Sabha Elections 2024: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ(BJP) తన అభ్యర్థుల మూడో జాబితాను(BJP Third List) విడుదల చేసింది. ఈ జాబితాలో కేవలం తమిళనాడుకు(Tamil Nadu) సంబంధించిన అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. ఇటీవల తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసైని.. చెన్నై సౌత్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. వినోజ్ పి సెల్వమ్‌ను చెన్నై సెంట్రల్, వెల్లూర్ - ఏ.సీ షణ్ముగం, కృష్ణగిరి - సి. నరసింహన్, నీలగిరి(ఎస్సీ) - ఎల్ మురుగన్, కోయంబత్తూర్ - కే. అన్నామలై. పెరంబలూర్ - టీఆర్. పారివేందర్, తూతుక్కుడి - నైనార్ నాగేంద్రన్, కన్నియకుమారి - పోన్ రాధాకృష్ణన్. మూడో జబితాలో మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులను ఖరారు చేసింది.

కాగా, బీజేపీ తన మొదటి జాబితాలో 194 మంది అభ్యర్థుల స్థానాలను ఖరారు చేయగా.. రెండో జాబితాలో 72 మంది పేర్లను ప్రకటించారు. ఇప్పుడు మూడో జాబితాగా 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. ఈ జాబితాలో తమిళనాడు రాష్ట్ర అభ్యర్థులను మాత్రమే ప్రకటించింది బీజేపీ. మొత్తంగా ఇప్పటి వరకు 275 మంది పేర్లను బీజేపీ ఖరారు చేసింది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 370, ఎన్డీయే కూటమి 400 స్థానాలకు పైగా గెలవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Mar 21 , 2024 | 06:55 PM