Share News

MLC elction: యూపీ, బీహార్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

ABN , Publish Date - Mar 09 , 2024 | 05:14 PM

కీలకమైన ఉత్తరప్రదేశ్, బీహార్ విధాన పరిషత్ ఎన్నికలకు తమ అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ శనివారంనాడు ప్రకటించింది.యూపీలోని 13 మంది ఎమ్మెల్సీల పదవీకాలం మే 5వ తేదీతో ముగియనుంది.

MLC elction: యూపీ, బీహార్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ

న్యూఢిల్లీ: కీలకమైన ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), బీహార్ (Bihar) విధాన పరిషత్ (MLC) ఎన్నికలకు తమ అభ్యర్థులను భారతీయ జనతా పార్టీ (BJP) శనివారంనాడు ప్రకటించింది. బీహార్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంగల్ పాండే, డాక్టర్ లాల్ మోహన్ గుప్తా, అనామికా సింగ్‌ పేర్లను ప్రకటించింది. కాగా, ఉత్తరప్రదేశ్ నుంచి విజయ్ బహదూర్ పాఠక్, డాక్టర్ మహేంద్ర కుమార్ సింగ్, అశోక్ కతరియా, మోహిత్ బెనివాల్, ధర్మేంద్ర సింగ్, రామ్‌తీర్థ్ సింఘాల్, సంతోష్ సింగ్‌లను తమ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించింది. యూపీలోని 13 మంది ఎమ్మెల్సీల పదవీకాలం మే 5వ తేదీతో ముగియనుంది.

Updated Date - Mar 09 , 2024 | 05:16 PM