Share News

BJP: బీజేపీకి అయోధ్యలో ఆదరణ కరవు..!!

ABN , Publish Date - Jun 06 , 2024 | 09:55 AM

యోధ్యలో ప్రతిష్ఠాత్మక రామ మందిరం నిర్మించిన అక్కడి ఓటర్లు బీజేపీని ఆదరించలేదు. ఫైజాబాద్ లోక్ సభ నుంచి బరిలోకి దిగిన లల్లు సింగ్ ఓడిపోయారు. దాంతో బీజేపీ శ్రేణులు, నేతుల షాక్ అయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. దాంతో బీజేపీ స్టాండ్ అయోధ్య నుంచి ఒడిశాకు మళ్లిందా అనే సందేహాలు కలుగుతున్నాయి.

BJP: బీజేపీకి అయోధ్యలో ఆదరణ కరవు..!!
PM Modi

ఢిల్లీ: అయోధ్యలో ప్రతిష్ఠాత్మక రామ మందిరం నిర్మించిన అక్కడి ఓటర్లు బీజేపీని ఆదరించలేదు. ఫైజాబాద్ లోక్ సభ నుంచి బరిలోకి దిగిన లల్లు సింగ్ ఓడిపోయారు. దాంతో బీజేపీ శ్రేణులు, నేతుల షాక్ అయ్యారు. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీకి ఆశించిన స్థాయిలో సీట్లు రాలేదు. దాంతో బీజేపీ స్టాండ్ అయోధ్య నుంచి ఒడిశాకు మళ్లిందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఎన్నికల ఫలితాల తర్వాత ప్రధాని మోదీ (PM Modi) ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ప్రసంగం ప్రారంభించే సమయంలో జై జగన్నాథ్ అని నినాదించారు. ఇదివరకు జై శ్రీరామ్ అనే వారు. ఒడిశా ప్రజలు బీజేపీకి పట్టం కట్టారు. 24 ఏళ్ల నితీశ్ పట్నాయక్ పాలనకు తెరదించి, బీజేపీకి అప్పగించారు. లోక్ సభలో కూడా భారీ సీట్లను గెలుపొందింది.


ప్రధాని మోదీ అలా నినాదించడం జగన్నాథుడికి ప్రాధాన్యం ఇస్తున్నారని స్పష్టం అవుతోంది. మోదీ ప్రసంగించే సమయంలో అక్కడున్న ఒడిశా బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి మహాప్రభు జగన్నాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఇది తమకు నిజంగా గర్వంగా ఉందని సంబరపడ్డారు. ప్రధాని మోదీ నినాదంతో ఒడిశా అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని స్పష్టం అవుతుందని తేల్చిచెప్పారు.

Updated Date - Jun 06 , 2024 | 09:56 AM