Share News

BJP MLA: కాంగ్రెస్‌ గిఫ్ట్‌ రాజకీయం.. రూ. 5వేల విలువైన కార్డుల పంపిణీ

ABN , Publish Date - Apr 10 , 2024 | 12:54 PM

బెంగళూరు గ్రామీణ లోక్‌సభ పరిధిలో గిఫ్ట్‌ పాలిటిక్స్‌ జోరుగా సాగుతున్నాయని రాజరాజేశ్వరినగర్‌ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న(Rajarajeshwarinagar BJP MLA Muniratna) తీవ్రమైన ఆరోపణ చేశారు.

BJP MLA: కాంగ్రెస్‌ గిఫ్ట్‌ రాజకీయం.. రూ. 5వేల విలువైన కార్డుల పంపిణీ

- బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న తీవ్ర ఆరోపణ

బెంగళూరు: బెంగళూరు గ్రామీణ లోక్‌సభ పరిధిలో గిఫ్ట్‌ పాలిటిక్స్‌ జోరుగా సాగుతున్నాయని రాజరాజేశ్వరినగర్‌ బీజేపీ ఎమ్మెల్యే మునిరత్న(Rajarajeshwarinagar BJP MLA Muniratna) తీవ్రమైన ఆరోపణ చేశారు. ఎన్నికలకు ముందే ప్రతి కుటుంబానికి రూ. 5వేల విలువైన కార్డులు ఇస్తున్నారని పేర్కొన్నారు. గత శాసనసభ ఎన్నికలలోనూ రూ. 5వేల విలువైన కార్డులను పంచి ఐదు నియోజకవర్గాల్లో గెలుపొందారని, మరోసారి అదే విధానం పాటిస్తున్నారని అన్నారు. ఇప్పటికే చీరలు, కుక్కర్లు పంపిణీ చేశారని, తాజాగా కార్డుల పంపిణీ సాగుతోందన్నారు. ఆర్‌ఆర్‌ నగర్‌లో వివిధ కేసుల్లో ఉండే పలువురు రౌడీలను విడుదల చేయిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్‏కు వ్యతిరేకంగా పనిచేస్తే ఊరు వదిలి వెళ్లాలని హెచ్చరిస్తున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ల సొమ్ము వస్తోందని ఆరోపించారు. ఎడమచేతిలో డబ్బు తీసుకుని, కుడి చేత్తో డాక్టర్‌కు ఓటు వేయాలన్నారు. బీజేపీ అభ్యర్థి సీఎన్‌ మంజునాథ్‌ 38 ఏళ్లుగా డాక్టర్‌గా ఎంతోమందికి సేవలందించారన్నారు. కేవలం జీతంతోనే జీవితాన్ని సాగించారని, ఆయన తలచుకుని ఉంటే ఎప్పుడో కోరుకున్న పదవికి వెళ్లేవారన్నారు

ఇదికూడా చదవండి: BJP candidate: ఆ రోలెక్స్‌ వాచ్‌ బిల్లు ఎక్కడుందో చెబుతారా..?

Updated Date - Apr 10 , 2024 | 12:54 PM