Share News

Ayodhya Temple: భక్తులకు అలర్ట్.. రోజూ గంట పాటు అయోధ్య బాలరాముని ఆలయం మూసివేత..

ABN , Publish Date - Feb 17 , 2024 | 11:02 AM

అయోధ్య బాలరాముని ఆలయంలో దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. శుక్రవారం ( నేడు ) నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట పాటు రామాలయాన్ని

 Ayodhya Temple: భక్తులకు అలర్ట్..  రోజూ గంట పాటు అయోధ్య బాలరాముని ఆలయం మూసివేత..

అయోధ్య బాలరాముని ఆలయంలో దర్శన వేళల్లో అధికారులు మార్పులు చేశారు. శుక్రవారం ( నేడు ) నుంచి ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక గంట పాటు రామాలయాన్ని మూసివేస్తున్నట్లు ప్రధాన పూజారి తెలిపారు. రామ్ లల్లాకు ఐదేళ్ల వయసు. కాబట్టి గంటల కొద్దీ మెలకువగా ఉండటం వల్ల ఒత్తిడిని భరించలేడని ఆయన తెలిపారు. ఈ కారణంగా బాలరాముడికి కొంత విశ్రాంతి ఇవ్వాలనే ఉద్దేశ్యంతో మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు ఆలయాన్ని మూసేస్తున్నట్లు వివరించారు.

సంప్రోక్షణ కార్యక్రమం అనంతరం ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్ట్ దర్శన సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పెంచింది. భక్తులు రాముడిని దర్శించుకునేందుకు సుమారు రెండు గంటల సమయం పడుతుంది. కాగా పవిత్రోత్సవానికి ముందు దర్శన సమయం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు ఉండేది.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 17 , 2024 | 11:07 AM