Share News

Road Accident: అర్ధరాత్రి అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..

ABN , Publish Date - Jun 03 , 2024 | 11:19 AM

వివాహానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని(Rajasthan) మోతీపురాకు చెందిన వివాహ బృందం 28 మందితో బంధువుల ఇంట్లో వివాహానికి ఆదివారం రాత్రి బయల్దేరింది.

Road Accident: అర్ధరాత్రి అనంతలోకాలకు.. రోడ్డు ప్రమాదంలో 13 మంది మృతి..

భోపాల్: వివాహానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో 13 మంది మృతి చెందారు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రాజస్థాన్‌లోని(Rajasthan) మోతీపురాకు చెందిన వివాహ బృందం 28 మందితో మధ్యప్రదేశ్‌లోని కులంపూర్‌లో తమ బంధువుల ఇంట్లో వివాహానికి ఆదివారం రాత్రి బయల్దేరింది.

రాజ్‌గఢ్ జిల్లాలోని పిప్లోడి సమీపానికి చేరుకోగానే.. రాత్రి 8 గంటలకు ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు చిన్నారులతో సహా 13 మంది మరణించారు. 15 మంది గాయపడ్డారు.


గాయపడిన వారిని రాజ్‌గఢ్ జిల్లా ఆసుపత్రిలో చేర్చారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో భోపాల్‌ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ జరుగుతోందని రాజ్‌గఢ్ కలెక్టర్ హర్ష్ దీక్షిత్ తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

For Latest News and National News click here

Updated Date - Jun 03 , 2024 | 11:19 AM