Kadiyam Kavya: మామునూర్ ఎయిర్ పోర్ట్ కోసం పార్లమెంట్ వేదికగా ఫైట్ చేస్తా
ABN , Publish Date - May 03 , 2024 | 08:22 AM
ఖిలా వరంగల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ప్రచారం నిర్వహించారు. వాకర్స్, కూరగాయల వ్యాపారుల వద్దకు వెళ్లి కాసేపు వారితో ముచ్చటించారు. తనకే ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కావ్య మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్నారు
![Kadiyam Kavya: మామునూర్ ఎయిర్ పోర్ట్ కోసం పార్లమెంట్ వేదికగా ఫైట్ చేస్తా](https://media.andhrajyothy.com/media/2024/20240215/2kavya_8a90b1a225.jpg)
వరంగల్: ఖిలా వరంగల్లో వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య ప్రచారం నిర్వహించారు. వాకర్స్, కూరగాయల వ్యాపారుల వద్దకు వెళ్లి కాసేపు వారితో ముచ్చటించారు. తనకే ఓటు వేయాలని అభ్యర్థించారు. అనంతరం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో కావ్య మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, మామునూర్ ఎయిర్ పోర్ట్ కోసం పార్లమెంట్ వేదికగా ఫైట్ చేస్తానని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చే యోచనలో ఉన్న బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లో ఓటు వేయొద్దని కోరారు. తనను గెలిపిస్తే తన తండ్రి కడియం శ్రీహరి సహకారంతో అభివృద్ధి చేస్తానని కడియం కావ్య స్పష్టం చేశారు.
AP Elections: నీవు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడా?..ముద్రగడపై పృథ్వి ఫైర్
Read Latest Election News or Telugu News