Share News

AP Elections 2024: రిటైర్డ్ ఏఆర్ ఎస్సై ఇంట్లో లక్షల్లో నగదు లభ్యం

ABN , Publish Date - May 07 , 2024 | 08:24 AM

రిటైర్డ్ ఏఆర్ ఎస్సై దుర్గాప్రసాద్ వర్మ ఇంట్లో 9.9 లక్షల రూపాయల నగదును పెందుర్తి నియోజకవర్గం ఎన్నికల విభాగం ఫ్లైయింగ్ సర్వేలైన్ టీం(ఎఫ్ఎన్టీ) స్వాధీనం చేసుకుంది. జీవీఎంసీ 95 వ వార్డు లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న ఏఆర్ మాజీ ఎస్ఐ దంతులూరి దుర్గా ప్రశాంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లు నగర టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది.

AP Elections 2024: రిటైర్డ్ ఏఆర్ ఎస్సై ఇంట్లో లక్షల్లో నగదు లభ్యం

విశాఖ: రిటైర్డ్ ఏఆర్ ఎస్సై దుర్గాప్రసాద్ వర్మ ఇంట్లో 9.9 లక్షల రూపాయల నగదును పెందుర్తి నియోజకవర్గం ఎన్నికల విభాగం ఫ్లైయింగ్ సర్వేలైన్ టీం(ఎఫ్ఎన్టీ) స్వాధీనం చేసుకుంది. జీవీఎంసీ 95 వ వార్డు లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న ఏఆర్ మాజీ ఎస్ఐ దంతులూరి దుర్గా ప్రశాంత్ వర్మ ఇంట్లో పెద్ద ఎత్తున నగదు ఉన్నట్లు నగర టాస్క్ ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది. దుర్గాప్రసాద్ వర్మ ఇంట్లో ఆ డబ్బు కొంచెం అనుమానాస్పదంగా అనుమానాస్పదంగా అనిపించడంతో సార్వత్రిక ఎన్నికల ఫ్లైయింగ్ సర్వేలైన్ టీం స్వాధీనం చేసుకుంది. జీడి పిక్కల వ్యాపార నిమిత్తం నగదు తీసుకు వచ్చినట్లు దుర్గాప్రసాద్ వర్మ చెబుతున్నారు. నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

AP Elections: జగన్‌ బేల మాటలు!


ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఒకే రోజున జరగనున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ పెద్ద ఎత్తున డబ్బు పట్టుబడుతోంది. ఎన్నికలకు సమయం ఆసన్నమవుతుండటంతో పోలీసులు మరింత ఎక్కువగా దృష్టి పెడుుతున్నారు. ప్రస్తుత తరుణంలో నగదు, మద్యం ఏరులై పారుతుందనడంలో సందేహమే లేదు. ఈ క్రమంలోనే వీటన్నింటికీ అడ్డుకట్ట వేయాలని పోలీసులు యత్నిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి మరీ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏదైనా సమాచారం అందినా.. లేదంటే అనుమానంగా అనిపించిన ప్రతి ఒక్కరి ఇంటిపై రైడ్ చేస్తున్నారు. ఆధారాలు లేకుండా ఏమైనా డబ్బు దొరికితే చాలు స్వాధీనం చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి..

PM MODI : మాఫియా రాజ్‌.. కరప్షన్‌ కింగ్‌

దేశంలో అమృత ఘడియలు.. రాష్ట్రంలో విష ఘడియలు

Read Latest National News and Telugu News

Updated Date - May 07 , 2024 | 08:24 AM