Share News

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎలా ఉందంటే..

ABN , Publish Date - Apr 04 , 2024 | 08:45 AM

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. విద్యార్థులకు పరీక్షలు నడుస్తుండటంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నేడు ఎలా ఉందంటే..

తిరుమల: తిరుమల (Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. విద్యార్థులకు పరీక్షలు నడుస్తుండటంతో భక్తుల రద్దీ పెద్దగా లేదు. నేడు (గురువారం) శ్రీవారి దర్శనం కోసం 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. కాగా.. బుధవారం శ్రీవారిని 61,087 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.34 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 22,530 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

AP Elections:ఆముదాలవలసలో ఆధిపత్యం ఎవరిది..?

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Apr 04 , 2024 | 09:24 AM