Share News

Andhra Pradesh: బాత్‌రూమ్‌లో ప్రసవించిన విద్యార్థిని.. పరిస్థితి విషమించడంతో..

ABN , Publish Date - Jan 28 , 2024 | 11:40 AM

తీవ్రంగా కడుపునొప్పి రావడంతో ఓ విద్యార్థిని బాత్‌రూమ్‌లోనే ప్రసవించిన ఘటన నంద్యాలలో జరిగింది. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ విభాగం....

Andhra Pradesh: బాత్‌రూమ్‌లో ప్రసవించిన విద్యార్థిని.. పరిస్థితి విషమించడంతో..

తీవ్రంగా కడుపునొప్పి రావడంతో ఓ విద్యార్థిని బాత్‌రూమ్‌లోనే ప్రసవించిన ఘటన నంద్యాలలో జరిగింది. ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ విభాగంలో రెండో ఏడాది చదువుతున్న విద్యార్థినికి తీవ్రంగా కడుపునొప్పి వచ్చింది. బాత్‌రూమ్‌కి వెళ్లగా అక్కడే బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటనతో ఆమె ఆరోగ్యం విషమించింది. సమాచారం అందుకున్న విద్యార్థిని తల్లిదండ్రులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతూ బాధితురాలు మృతి చెందింది. కాగా.. మృతురాలు తమ కళాశాలలో గతేడాది సెప్టెంబర్ లో చేరిందని కళాశాల యాజమాన్యం తెలిపింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Updated Date - Jan 28 , 2024 | 11:41 AM