Share News

Anant Radhika Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్లు సందడి.. ఎవరెవరు వచ్చారంటే..

ABN , Publish Date - Mar 01 , 2024 | 05:23 PM

పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం సాయంత్ర 5:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు మార్చి 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి.

Anant Radhika Wedding: అనంత్ అంబానీ పెళ్లి వేడుకల్లో టీమిండియా క్రికెటర్లు సందడి.. ఎవరెవరు వచ్చారంటే..

జామ్‌నగర్: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక వివాహ ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం సాయంత్ర 5:30 గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు మార్చి 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. జూలై 12న ముంబైలో వివాహం జరగనుంది. అయితే మూడు రోజులపాటు ఘనంగా జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల్లోని అతిరథ మహారథులు తరలివస్తున్నారు. అనేక మంది పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సెలబ్రెటీలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. అంబానీ ఆహ్వానం మేరకు ఇప్పటికే అనేక మంది అతిథులు ప్రీ వెడ్డింగ్ వేడుకలు జరిగే జామ్‌నగర్‌కు చేరుకున్నారు. తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు జామ్‌నగర్ విచ్చేశారు. హిట్‌మ్యాన్ ఎయిర్‌పోర్టు నుంచి వస్తున్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఐపీఎల్‌లో అంబానీకి చెందిన ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా రోహిత్ శర్మ 5 ట్రోఫీలు అందించిన సంగతి తెలిసిందే.


అలాగే భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ భార్య అంజలితో కలిసి జామ్‌నగర్ చేరుకున్నారు. ఐపీఎల్‌లో ఆడినన్నీ రోజులు సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్‌కే ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీవెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని భార్య సాక్షితో కలిసి జామ్‌నగర్ చేరుకున్నారు. అలాగే ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు, భార్యభర్తలైన సైనా నేహ్వాల్, పారుపల్లి కశ్యప్ కూడా జామ్‌నగర్ చేరుకున్నారు. ఇక అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక ట్రంప్ వేడుకలు జరిగే గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకున్నారు. ఇవాంక ఎయిర్‌పోర్టులో కనిపించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీ కూడా భార్య పిల్లలతో కలిసి జామ్‌నగర్ చేరుకున్నారు. వీరితోపాటు ప్రీవెడ్డింగ్ వేడుకల్లో బాలీవుడ్ నటులు షారూక్ ఖాన్, రణవీర్ సింగ్, దీపికా పనదుకొణే.. అంతర్జాతీయ ప్రముఖులు పాప్ సింగర్ రిహన్నా, అమెరికన్ గాయని, గేయ రచయిత జే బ్రౌన్, వాయిద్యారుడు బాసిస్ట్ ఆడమ్ బ్లాక్‌స్టోన్, బీపీ మాజీ సీఈఓ బాబ్ డడ్లీ, బీపీ సీఈఓ ముర్రే ఆచిన్‌క్లోస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీఎంఎస్ ప్రసాద్ ఈ వేడుకల్లో సందడి చేయనున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 05:24 PM