Share News

Anant Radhika Wedding: అనంత్ అంబానీ- రాధిక పెళ్లి ఖర్చు రూ.1,000 కోట్లు?

ABN , Publish Date - Mar 01 , 2024 | 04:45 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికల వివాహం ప్రీవెడ్డింగ్ వేడుకలకు అంతా సిద్ధమైంది.

Anant Radhika Wedding: అనంత్ అంబానీ- రాధిక పెళ్లి ఖర్చు రూ.1,000 కోట్లు?

జామ్‌నగర్‌: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ వివాహం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ రెండో కుమారుడు అనంత్ అంబానీ, పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధికల వివాహం ప్రీవెడ్డింగ్ వేడుకలకు అంతా సిద్ధమైంది. మార్చి 1 నుంచి 3 రోజులపాటు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రీ వెడ్డింగ్ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. శుక్రవారం సాయంత్రం 5:30 గంటల నుంచి ప్రారంభంకానున్న ఈ వేడుకలకు దేశ విదేశాల్లోని అతిథ మహారథులకు ఆహ్వానం అందింది. ఇప్పటికే అనేక మంది అతిథులు ప్రీవెడ్డింగ్ వేడుకలు జరిగే జామ్‌నగర్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంక జామ్‌నగర్ చేరుకున్నారు. అలాగే మెటా అధినేత మార్కు జుకర్‌బర్గ్, ఆయన సమీమణి ప్రిసిల్లా చాన్‌తో కలిసి జామ్‌నగర్ చేరుకున్నారు. ప్రీవెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే అతిథులందరికీ ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలుకుతున్నారు.


అయితే పలువురు చెబుతున్న దాని ప్రకారం.. అనంత్ అంబానీ- రాధికల వివాహానికి రూ.1,000 కోట్లకుపైగా ఖర్చు చేస్తున్నారట. వివాహ వేడుకలు ప్రారంభం కావడం నుంచి ముగిసే వరకు మొత్తం రూ.1,000కుపైగా ఖర్చు అవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు. డాలర్ల పరంగా చూస్తే దీని విలువ 120 మిలియన్ డాలర్లకుపైగా ఉంటుంది. దీంతో అత్యంత ఖరీదైన పెళ్లిగా అనంత్ అంబానీ-రాధికల వివాహం నిలవనుంది సమాచారం. ముఖేష్ అంబారీ కూతురు ఇషా అంబానీ-ఆనంద్ పిరమిల్ వివాహం కోసం రూ.700 కోట్లకుపైగా ఖర్చు చేసినట్టు సమాచారం. అలాగే ప్రిన్స్ ఛార్లెస్- ప్రిన్సెస్ డయానా వివాహం ఇప్పటివరకు అత్యంత ఖరీదైనదిగా ఉంది. వారి వివాహానికి రూ.916 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. ప్రస్తుతం రూ.1,000 కోట్లతో అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం ఆ రికార్డును అధిగమిస్తుందని పలువురు చెబుతున్నారు. ఇదే జరిగితే అత్యంత ఖరీదైన వివాహంగా అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ వివాహం రికార్డు నెలకొల్పనుంది.

జూలై 12న ముంబైలో వివాహం జరగనుండగా జామ్‌నగర్‌లో ఇప్పటికే వేడుకలు ప్రారంభమయ్యాయి. జామ్‌నగర్ జోగ్వాడ్ గ్రామంలో అన్న సేవతో బుధవారం వివాహం ముందుస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి. వేలాదిమంది స్థానికులకు ముఖేష్ అంబానీ వారి కుటుంబసభ్యులు స్వయంగా భోజనం వడ్డించారు. ఇక మార్చి 1 నుంచి 3 మధ్య జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చే అతిథుల కోసం రికార్డు స్థాయిలో 2,500 వంటకాల్సి సిద్ధం చేసినట్టు సమాచారం. ప్రపంచలోని అన్ని రకాల వంటకాలను సిద్ధం చేశారట. ఇందుకోసం దేశ విదేశాల్లోని చెఫ్స్‌ను పిలిపించినట్లు సమాచారం. అతిథుల కోసం ప్రత్యేక మెనూ కూడా సిద్ధం చేయించారట. కాగా గతేడాది జనవరిలో అనంత్ అంబానీ- రాధికల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Mar 01 , 2024 | 05:30 PM